Begin typing your search above and press return to search.

పురందేశ్వరిపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు... బాబు కోసమా?

ఏపీ అప్పుల్లో ఉందని పురంధేశ్వరి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పిన రోజా... మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అప్పు తక్కువని

By:  Tupaki Desk   |   29 July 2023 10:53 AM GMT
పురందేశ్వరిపై  మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు... బాబు కోసమా?
X

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలకు ఇంకా సుమారు ఎనిమిది నెలలు ఉన్నాయని అంటోన్న వేళ ఇప్పటినుంచే కాకమొదలైపోయింది. ఒకపక్క రాష్ట్రం తడిసి ముద్దవుతుంటే... మరోపక్క రాజకీయాల్లో సెగలు వెదజిమ్ముతున్నాయి. ఇందులో భాగంగా ఏపీలో తాజాగా వైసీపీ వర్సెస్ బీజేపీ చర్చ తెరపైకి వచ్చింది!

అవును.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్థిక పరమైన అంశాలపైనా.. జగన్ పాలనపైనా ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరో పక్క కేంద్రంలో పెద్దలు వివరణ ఇస్తున్నాప్పటికీ.. పురందేశ్వరి తగ్గడం లేదు. దీంతో... పురందేశ్వరిని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు.

ఇందులో భాగంగా... తాజాగా పురందేశ్వరి వ్యవహారంపై స్పందించారు మంత్రి ఆర్కే రోజా. ఏపీ అప్పుల్లో ఉందని పురంధేశ్వరి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పిన రోజా... మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అప్పు తక్కువని, అప్పు చేసిన ప్రతీ రూపాయికీ సరైన లెక్క ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన విషయాలు గుర్తు చేశారు.

చంద్రబాబు చేసిన విమర్శలనే పురందేశ్వరి మేడం కూడా చేయడం చూస్తుంటే... పురంధేశ్వరి మేడం బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలా లేక టీడీపీ అధ్యక్షురాలా అనే సందేహం వస్తోందని రోజా సందేహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో... ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని చంద్రబాబు నుంచి నందమూరి కుటుంబం తీసుకోవాలని సూచించారు.

దీంతో... మేడం మేడం అంటూనే ఇవ్వాల్సింది ఇచ్చి పడేశారు.. చెప్పాల్సింది చెప్పేశారు రోజా అని కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ సందర్భంగా పవన్, చంద్రబాబులపై కూడా రోజా మరోసారి స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా... ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని చెప్పిన రోజా... పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టింది ప్యాకేజీల కోసమేనని ఫైరయ్యారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని ఎద్దేవా చేసారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్‌ ధ్యేయమని మంత్రి రోజా ధ్వజమెత్తారు.

ఓ మ్యాప్‌ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో ఉన్నప్పుడు ఏమి చేశారు? చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గుర్తుకురాదు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు అభివృద్ధి గుర్తుకువస్తుంది.. అని రోజా ఫైరయ్యారు.

అనంతరం చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నదులు అనుసంధానం కన్నా నిధుల అనుసంధానం చేయడంలోనే ఎక్కువ దృష్టి పెట్టారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రోజా!

కాగా... పురదేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇపప్టికే ఆన్ లైన్ వేదీకగా సెటైర్స్ వేసిన సంగతి తెలిసిందే. ఆయన కూడా బీజేపీలో ఉన్న పురందేశ్వరి.. మరోపార్టీ కోసం పనిచేస్తోందనే అర్ధం వచ్చేలా ఒక ట్వీట్ చేశారు.

"కొత్త అధ్యక్షురాలు ఫ్లెక్సీలతో లేని హడావుడి చేసే బదులు... వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలనో, రైల్వే జోన్, ఇండస్ట్రియల్ కారిడార్ త్వరగా ఏర్పాటు చేయాలనో పోరాడొచ్చుగా! ప్రజలకు కాస్తయినా ప్రయోజనం ఉంటుంది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేయడం ఎందుకు?" అని ట్వీట్ చేస్తూ.. పురందేశ్వరికి సంబంధించిన భారీ ఫ్లెక్సీ ఫోటొను పోస్ట్ చేశారు సాయిరెడ్డి.