Begin typing your search above and press return to search.

ఇచ్చాపురం టీడీపీకి అచ్చిరాదా...?

తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత తొమ్మిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే అందులో ఎనిమిది సార్లు టీడీపీయే గెలిచింది అంటే ఇచ్చాపురం పసుపు పరవశం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి.

By:  Tupaki Desk   |   23 Nov 2023 9:36 AM GMT
ఇచ్చాపురం టీడీపీకి అచ్చిరాదా...?
X

తెలుగుదేశం పార్టీకి ఇచ్చాపురం నియోజకవర్గం కంచుకోట. తెలుగుదేశం పార్టీ పుట్టిన తరువాత తొమ్మిదిసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే అందులో ఎనిమిది సార్లు టీడీపీయే గెలిచింది అంటే ఇచ్చాపురం పసుపు పరవశం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలి.

అలాంటి ఇచ్చాపురంలో పాదయాత్ర ముగించాలన్న టీడీపీ ఇచ్చ మాత్రం ఏ కోశానా నెరవేరడంలేదు. నాడు చంద్రబాబు నేడు లోకేష్ ఇద్దరూ కూడా ఇచ్చాపురం ముఖం చూడకుండా పాదయాత్రను క్లోజ్ చేశారు. చంద్రబాబు విషయానికి వస్తే ఆయన 2012 గాంధీ జయంతి వేళ పాదయాత్ర స్టార్ట్ చేశారు. 2013 ఏప్రిల్ లో ఆయన విశాఖలో తన పాదయాత్ర ముగించారు.

చంద్రబాబు కంటే ముందు పాదయాత్ర 2003లో వైఎస్సార్ చేశారు. ఆయన చేవేళ్లలో చేపట్టిన పాదయాత్ర ఇచ్చాపురం దాకా కొనసాగింది. అక్కడే స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. ఇక వైఎస్ షర్మిల పాదయాత్ర 2012 నుంచి 2013 మధ్య దాకా చేశారు. ఆమె తెలంగాణా నుంచే పాదయాత్ర స్టార్ట్ చేసి ఇచ్చాపురంలో ముగించారు.

ఆ తరువాత వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలెట్టారు. ఆయన కూడా మూడు వేల 700 కిలోమీటర్లు దాకా నడిచి ఇచ్చాపురంలో దాన్ని ముగించారు. పాదయాత్ర చేసినందుకు గుర్తుగా అక్కడ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు.

ఇలా వైఎస్సార్ ఫ్యామిలీలో పాదయాత్ర చేసిన ముగ్గురూ ఇచ్చాపురం దాకా వెళ్ళి తమ లక్ష్యాన్ని సాధించారు. చిత్రంగా చంద్రబాబు ఫ్యామిలీలో మాత్రం ఇచ్చాపురం రాకుండానే పాదయాత్ర ముగుస్తోంది. చంద్రబాబు విశాఖలో పాదయత్ర ఆపు చేస్తే యువగళం పాదయాత్ర ద్వారా లోకేష్ ఇచ్చాపురం వరకూ ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దాకా నడుస్తారు అని అనుకున్నారు.

లోకేష్ సైతం అలాగే వేగంగా నడక సాగించారు. ఆయన ఈ విధంగా ఎనిమిది జిల్లాలలో పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. చంద్రబాబు అరెస్ట్ తో ఆయన కోనసీమ జిల్లా రాజోలులో పాదయాత్రను సెప్టెంబర్ 9న నిలుపు చేశారు. దాదాపు తొంబై రోజుల తరువాత ఈ నెల 27న పాదయాత్రను తిరిగి లోకేష్ ప్రారంభించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకూ 208 రోజులలో 84 నియోజకవర్గాలలో 2,852.4 కిలోమీటర్లను లోకేష్ నడిచారు. అయితే లోకేష్ పాదయాత్ర ఇంకా వేయికి పైగా కిలోమీటర్ల బాకీ ఉంది. కానీ దాన్ని అయిదు వందల కిలోమీటర్లకే కుదించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అదేలా అంటే విశాఖలో లోకేష్ పాదయాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు ప్రకటిస్తున్నాయి. దానికి కారణం ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. వ్యవధి లేకపోవడమే అంటున్నారు. ఇచ్చాపురం వరకూ పాదయాత్ర చేయాలంటే కచ్చితంగా మార్చి దాకా సమయం పడుతుంది. అప్పటికే ఎన్నికల హడావుడి మొదలవుతుంది.

దాంతో ఆ పాదయాత్రను కాస్తా విశాఖకు పరిమితం చేస్తే ఈ డిసెంబర్ నెలాఖరుకైనా లేదా జనవరి నాటికైనా పూర్తి కావచ్చు అని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇచ్చాపురం దాకా నడవాలని, అలాగే జగన్ పాదయాత్ర రికాడుని బద్ధలు కొట్టాలని లోకేష్ పెట్టుకున్న టార్గెట్ మాత్రం నెరవేరే చాన్స్ అయితే లేదు అంటున్నారు.