Begin typing your search above and press return to search.

గంటాకు బాబు సర్ ప్రైజ్ ఇస్తున్నారా...!?

గంటాకు మూడు విడతలుగా రిలీజ్ చేసిన జాబితాలలో టికెట్ దక్కలేదు.

By:  Tupaki Desk   |   24 March 2024 12:30 AM GMT
గంటాకు బాబు సర్ ప్రైజ్ ఇస్తున్నారా...!?
X

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు సర్ ప్రైజ్ ఇస్తున్నారా అంటే అవును అని అంటున్నారు. గంటాకు మూడు విడతలుగా రిలీజ్ చేసిన జాబితాలలో టికెట్ దక్కలేదు. దాంతో ఆయన వర్గం తీవ్ర ఆందోళనలో ఉంది. గంటాను చీపురుపల్లి వెళ్ళమని బాబు అంటున్నారని ప్రచారం సాగింది.

దానికి గంటా నో చెప్పారని తనకు భీమిలీ టికెట్ ఇస్తే గెలిచి వస్తాను అని హామీ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అయితే గంటాకు భీమిలీ సీటు లేదని బాబు చెప్పేసినట్లుగా కూడా కొంత చర్చ సాగింది. కానీ ఎట్టకేలకు భీమిలీ టికెట్ ఖరారు చేస్తూ బాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు.

గంటాకు భీమిలీ టికెట్ దక్కడం వెనక ఆయన సామాజిక వర్గం కోటా కూడా పనిచేసింది అని అంటున్నారు. టీడీపీ ఇప్పటిదాకా ప్రకటించిన జాబితాలో కాపు అభ్యర్ధి ఎవరూ లేకపోవడంతో గంటాకు అదే కలిసి వచ్చింది అని అంటున్నారు. పైగా భీమిలీలో గంటా అభ్యర్థి అయితేనే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుని ఓడిస్తారు అని టీడీపీ చేయించిన సర్వేలో తేలింది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే గంటాకు ఇప్పటికే బాబు భీమిలీ సీటు మీద సంకేతాలు ఇచ్చేశారని ఆయనను పనిచేసుకోమని కూడా కోరారని అంటున్నారు. దాంతో గంటా తన పని మొదలెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే గంటా భీమిలీలో పోటీ చేస్తే కనుక అది ఇద్దరు కీలక నేతల మధ్య పోరుగా సాగుతుంది అంటున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటాకు ఒకనాటి నేస్తం. పైగా గంటాయే ఆయనను రాజకీయాల్లోకి తెచ్చారు అని అంటారు.

ఇక చూస్తే కనుక 2019లో భీమిలీ సీటు విషయంలో వచ్చిన పేచీ మూలంగానే అవంతి వైసీపీలో చేరి టికెట్ సంపాదించారు. ఆ మీదట మంత్రి కూడా అయిపోయారు. ఇక టీడీపీలో ఉన్న గంటాకు భీమిలీ టికెట్ ఇవ్వకుండా చివరి నిముషంలో విశాఖ ఉత్తరం ఇచ్చారు. దాంతో ఆయన గెలిచారు. కానీ పార్టీ ఓడింది. మాజీ మంత్రిగా అయిదేళ్ల పాటు గంటా గడిపారు. ఇపుడు టీడీపీ కూటమి గెలిస్తే మరోమారు మంత్రిగా హవా చలాయించాలని గంటా తలపోస్తున్నారు. దాంతో ఆయన భీమిలీ నుంచి పోటీకి తయారు అవుతున్నారు. మరి భీమిలీలో గంటా వర్సెస్ అవంతిల మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాల్సిందే.