Begin typing your search above and press return to search.

బావ క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే: పురందేశ్వ‌రి పై రోజా ఫైర్‌!

రెయిన్ గన్ ల పేరిట రైతులను చంద్రబాబు మోసం చేస్తే.. ప్ర‌స్తుత సీఎం జగన్ రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:53 PM GMT
బావ క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే:  పురందేశ్వ‌రి పై రోజా ఫైర్‌!
X

గ‌త కొన్ని రోజులుగా వైసీపీ స‌ర్కారుపై వివిధ రూపాల్లో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న బీజేపీ ఏపీ చీఫ్‌ పురందేశ్వ‌రిపై మంత్రి, వైసీపీ నాయ‌కురాలు రోజా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబును మించిన జ‌గ‌త్ కిలాడీ అంటూ.. పురందేశ్వ‌రిపై నిప్పులు చెరిగారు. అంతేకాదు.. బావ చంద్ర‌బాబు క‌ళ్ల‌లో ఆనందం కోస‌మే వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని అన్నారు. తండ్రి ఎన్టీఆర్‌.. ఇలాంటి కూతురును క‌న్నందుకు కుమిలికుమిలి ఏడుస్తుంటార‌ని దుయ్య‌బ‌ట్టారు.

రెయిన్ గన్ ల పేరిట రైతులను చంద్రబాబు మోసం చేస్తే.. ప్ర‌స్తుత సీఎం జగన్ రైతు కుటుంబాలను ఆదుకుంటున్నారని అన్నారు. చంద్ర‌బాబు రైతు ద్రోహి అని వ్యాఖ్యానించారు. త‌న‌పై న‌మోదైన కేసుల‌ను త్వరగా తేల్చాల‌ని స్వయంగా జగన్ పిటిషన్ వేసుకున్నార‌ని, కానీ, చంద్ర‌బాబు మాత్రం త‌న‌పై కేసుల్లో స్టేలు తెచ్చుకున్నార‌ని విమ‌ర్శించారు. దీనిపై తేల్చాల‌ని ముందు పురందేశ్వ‌రి లేఖ రాయాల‌ని సూచించారు.

''నీకంటూ ఓ నియోజకవర్గం లేదు. నీకు ఓట్లు వేసే వారూ లేరు. ఎన్టీఆర్ కూతురు అని ఓ ట్రంప్ కార్డు వాడుకొని పార్టీలు మారి పదవులు పొందావు'' అని రోజా దుయ్య‌బ‌ట్టారు. అంతేకాదు, ఎన్టీఆర్ కు నువ్వు కనీసం అన్నం కూడా పెట్టలేదని, నీళ్లు ఇవ్వలేదని, కూతురిగా ఆయనకు సేవ చేయలేదని విమ‌ర్శించారు. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబును మించిన జగత్ కిలాడీ నువ్వు అని వ్యాఖ్యానించారు.

సీఎం సీటు కోసం నాడు నువ్వు, చంద్రబాబు పోటీ పడ్డార‌ని అన్నారు.. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఆయన ఇస్తున్న స్క్రిప్ట్ చదువుతున్నావని అన్నారు. ''మీకు పదవులే ముఖ్యం. ఏ తండ్రికి కూడా ఇలాంటి నీతిమాలిన కూతురు పుట్టకూడదు'' అని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. స్కీమ్ లను స్కాంలుగా చంద్రబాబు వాడుకున్నారని, రెయిన్ గన్ లతో కరవు జయించానని చెప్పుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రెయిన్ గ‌న్‌ల విష‌యంలోనూ చంద్ర‌బాబుపై త్వ‌ర‌లోనే కేసు న‌మోదు కానుంద‌ని రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రి రోజా వ్యాఖ్య‌ల‌పై పురందేశ్వ‌రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.