Begin typing your search above and press return to search.

భర్తల గెలుపు కోసం రంగంలోకి భార్యలు !

అలా చూసుకుంటే ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు.

By:  Tupaki Desk   |   15 April 2024 5:32 PM GMT
భర్తల గెలుపు కోసం రంగంలోకి భార్యలు !
X

భర్తల విజయం వెనుక భార్యలు తప్పనిసరిగా ఉంటారు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ప్రతీ మగవాని విజయం వెనక ఆడది కచ్చితంగా ఉంటుంది. అలా చూసుకుంటే ఏపీలో దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి పులివెందులలో మకాం వేస్తున్నారు.

ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తారు. పులివెందుల లో ఆమె ఉంటూ ఎన్నికల పర్వం పూర్తి అయ్యేంతవరకూ జనంలోనే ఉండనున్నారు. ఇక మాజీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరఫున కుప్పంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.

ఆ విధంగా ప్రచార పర్వంలోకి ఆమె అడుగుపెడుతున్నారు. ఆమె కూడా ఎన్నికలు పూర్తి అయ్యేంతవరకూ కుప్పంలోనే ఉండనున్నారు. ఇక తెలుగు దేశం యువ నేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో ప్రకటించబోతున్నారు. ఆమె కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు. అదే విధంగా భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలం అయ్యేలా చూస్తారు అని అంటునారు.

అదే విధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగుపెట్టేశారు. ఆమె భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ విధంగా చూసూంటే కనుక ముఖ్య నేతల సతీమణులు నడుం బిగించారు అన్న మాట.

భర్త భారీ విజయం నమోదు చేయాలని ఎవరికి వారుగా తాపత్రయపడుతున్నారు. ఈసారి ఎన్నికలు కూడా ఓవర్ హీట్ తో సాగుతున్నాయి. చావో రేవో అన్నట్లుగా టీడీపీ వైసీపీ ఈ ఎన్నికలను తీసుకున్నాయి. దాంతో ఈసారి ఎన్నికలలో చమటోడుస్తున్న ముఖ్య నేతలకు అండగా ఉంటూ వారి నియోజకవర్గాలను అట్టిపెట్టుకొని ఉంటూ తాము కూడా సిద్ధం అంటున్నారు సతులు. దీంతో ఈసారి ఈ విషయం ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది.