Begin typing your search above and press return to search.

విశ్వక్ ప్లాన్ అదా? టైమ్ వేస్ట్ చేయొట్లేదుగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్డీటాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్.

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:42 AM GMT
విశ్వక్ ప్లాన్ అదా? టైమ్ వేస్ట్ చేయొట్లేదుగా!
X

టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్డీటాలెంటెడ్ గా దూసుకెళ్తున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా తన హోమ్ బ్యానర్లపై కల్ట్ మూవీని ప్రకటించిన ఆయన.. ప్రస్తుతం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితోపాటు VS 10 నటిస్తున్నారు.

అయితే విశ్వక్ సేన్ కెరీర్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా చెప్పొచ్చు. ఈ సినిమాను త్వరగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. తన చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నా.. ఈ మూవీకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి షూటింగ్ పూర్తయ్యేల్లా చూశారట విశ్వక్ సేన్. కానీ ఆ సినిమా విడుదల డేట్ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పుడు నెట్టింట మరో వార్త చక్కర్లు కొడుతోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ కి ఎలానూ టైం ఉంది కనుక.. ఈలోపల విశ్వక్ వేరే సినిమాలను లైన్లో పెట్టి వర్క్ నడిపించాడంటా . ఆ సినిమాలో ఓ పాట షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందట. అందుకే జనవరి సెకండ్ వీక్ లో షూటింగ్ మళ్లీ మొదలుపెట్టినా.. టైమ్ సరిపోతుందని ఫిక్స్ అయ్యారట. ఇంతలోపు ఇదివరకే ఫిక్స్ అయిన సినిమాలకు వర్క్ చేసాడు అంట .

గతంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ వాయిదా విషయంలో విశ్వక్ ఫుల్ ఫైర్ అయ్యారు. 2023 డిసెంబర్లో గానీ ఈ మూవీ రిలీజ్ కాకపోతే.. తన ప్రమోషన్స్లో పాల్గొనని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే తన పోస్ట్ పై విశ్వక్ సేన్ స్పందించారు. ఈ మూవీ ప్రమోషన్స్లో కచ్చితంగా పాల్గొంటానని క్లారిటీ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని ఎప్పుడో రిలీజ్ చేద్దామనుకున్నామని తెలిపారు విశ్వక్ సేన్. 102 రోజుల షూటింగ్ పూర్తయిందని, మరో సాంగ్ మాత్రమే పెండింగ్ ఉందని వెల్లడించారు. అయితే మరో సినిమాలో తాను బిజీగా ఉండడం వల్ల నెలన్నర గ్యాప్ వచ్చిందని, శివరాత్రికి రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ సినిమాతో విశ్వక్ మరో భారీ సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ అంటున్నారు.

ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి డెల్టా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.