Begin typing your search above and press return to search.

సలార్‌ అవ్వకుండానే ఎన్టీఆర్‌ తో ఎలా...?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌ దర్శకుడు అయ్యాడు.

By:  Tupaki Desk   |   20 May 2024 7:06 AM GMT
సలార్‌ అవ్వకుండానే ఎన్టీఆర్‌ తో ఎలా...?
X

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌ దర్శకుడు అయ్యాడు. కేజీఎఫ్‌ రెండు పార్ట్‌ లు కూడా భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. అదే ఊపు తో వచ్చిన సలార్‌ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.


ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ 2 సినిమా పై వర్క్‌ చేస్తున్నాడు. ఈ ఏడాది చివరి వరకు సలార్‌ 2 కి సంబంధించిన షూటింగ్ ఉంటుంది అంటూ ఆ మధ్య చిత్ర యూనిట్‌ సభ్యులు ఒకరు మీడియాతో మాట్లాడిన సందర్భంగా చెప్పుకొచ్చాడు. అంటే ఈ ఏడాదిలో సలార్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్ మరే సినిమాను మొదలు పెట్టక పోవచ్చు అని అంతా అనుకున్నారు.

కానీ నేడు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తికర ప్రకటన చేసింది. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో మా బ్యానర్‌ లో రూపొందబోతున్న సినిమా ను ఈ ఏడాది ఆగస్టు లో షూటింగ్ ప్రారంభించబోతున్నాం అంటూ పేర్కొన్నారు.

ఆగస్టు కు కనీసం మూడు నెలల సమయం కూడా లేదు. మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ సలార్ సినిమాను ఎన్టీఆర్ దేవర మరియు వార్‌ 2 సినిమాలను చేస్తున్నాడు. అలాంటప్పుడు ఎలా ఎన్టీఆర్‌ - ప్రశాంత్‌ నీల్ మూవీ ఆగస్టు లో ప్రారంభం అవుతుంది అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే చాలా కాలంగా ప్రకటిస్తూ వస్తున్న వీరి కాంబో మూవీ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఫ్యాన్స్ లో అసంతృప్తి తొలగించి కాస్త హడావిడి చేసేందుకు ఆగస్టు అంటూ మైత్రి వారు పబ్లిసిటీ స్టంట్‌ చేశారని, సినిమా ప్రారంభంకు 2025 వరకు ఆగాల్సి ఉండొచ్చు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.