Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 'డ్రాగన్‌' కోసం ఏం చేశారంటే...!

కేజీఎఫ్‌, సలార్‌ సినిమాలతో సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   1 Jun 2025 8:30 PM
ఎన్టీఆర్‌ డ్రాగన్‌ కోసం ఏం చేశారంటే...!
X

కేజీఎఫ్‌, సలార్‌ సినిమాలతో సౌత్ ఇండియాలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు డ్రాగన్‌ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వర్కింగ్‌ టైటిల్‌ గా డ్రాగన్‌ను అనుకుంటున్న మేకర్స్ త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసే అవకాశాలు ఉన్నాయి. డ్రాగన్ సినిమాలో హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ నటిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్‌తో పాటు పలువురు సీనియర్‌ నటీ నటులు కనిపించబోతున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 'డ్రాగన్‌' సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. త్వరలోనే మరో షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. అందుకోసం ఒక భారీ సెట్టింగ్‌ను వేయించారు. ఆ సెట్టింగ్‌లో డ్రాగన్ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాకే హైలైట్‌గా నిలిచే ఆ యాక్షన్‌ సన్నివేశాల కోసం ఈ భారీ సెట్‌ను దర్శకుడు ప్రశాంత్‌ భారీగా వేయిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో భారీ సెట్స్‌ కనిపిస్తూ ఉన్నాయి. ఆ సెట్స్‌ అన్నింటికి మించి ఈ సెట్‌ ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది.

ఎన్టీఆర్‌ ప్రస్తుతం వార్‌ 2 సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణలో పాల్గొంటాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్‌ 2 సినిమాను ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇక ఎన్టీఆర్‌ డ్రాగన్‌ సినిమాను మొదట 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించే అవకాశం లేదని తేలిపోయింది. అందుకే సినిమాను 2026 సమ్మర్‌కి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త విడుదల తేదీ విషయంలో మేకర్స్ ఒక నిర్ణయానికి వచ్చారు అంటూ సమాచారం అందుతోంది.

కేజీఎఫ్‌ రెండు పార్ట్‌లు బాక్సాఫీస్‌ వద్ద సాధించిన విజయంతో పాటు సలార్‌ 1 సినిమా దక్కించుకున్న రికార్డ్‌ల నేపథ్యంలో డ్రాగన్‌ సినిమా అత్యధిక వసూళ్లు సాధించే విధంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే డ్రాగన్‌ సినిమాను ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మధ్య చాలా కాలంగా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘ కాలపు ఈ స్నేహంకు గుర్తుగా డ్రాగన్‌ సినిమా ఉంటుందని, ఎన్టీఆర్‌ కి ప్రశాంత్‌ నీల్‌ ఇవ్వబోతున్న పెద్ద బహుమానంగా డ్రాగన్ సినిమా ఉంటుందని అభిమానులతో పాటు నమ్మకంగా ఉన్నారు. మరి అంచనాలను ప్రశాంత్‌ నీల్‌ అందుకుంటాడా అనేది చూడాలి.