Begin typing your search above and press return to search.

జూన్ 9 న వెంకీ- మహేష్ లండన్ లో.. ఎందుకు?

By:  Tupaki Desk   |   3 Jun 2019 9:43 AM GMT
జూన్ 9 న వెంకీ- మహేష్ లండన్ లో.. ఎందుకు?
X
టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య ఫ్రెండ్ షిప్ గతంలో కంటే ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో పబ్లిక్ గా అలా ఫ్రెండ్షిప్ ను చూపించుకునేవారు కాదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని స్టార్ హీరోలు కలిసిన ఫోటోలు బైటకు వస్తున్నాయి., అంతే కాదు సెలబ్రిటీలు కూడా తమ ఫోటోలను ట్విట్టర్ ద్వారానో.. ఇన్స్టాగ్రామ్ ద్వారానో షేర్ చేసుకుంటూ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. విక్టరీ వెంకటేష్ కు మధ్య ఉన్న అనుబంధం సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా 'మహర్షి' ఈవెంట్ కు వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు.

సినిమా కాకుండా ఈ ఇద్దరు హీరోలలో ఉన్న మరో కామన్ అభిరుచి ఏంటంటే క్రికెట్. క్రికెట్ మ్యాచ్ ఉండి.. తమకు ఫ్రీ టైం ఉంటే ఇద్దరూ అసలు టీవీని వదిలిపెట్టరట. హైదరాబాద్ లో ఎప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచ్ జరిగినా వెంకీ మిస్ చేయకుండా స్టేడియంలో ప్రత్యక్షం అవుతారు. ఒక్కోసారి ఐపీఎల్ మ్యాచులాకు కూడా హాజరవుతారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో క్రికెట్ వరల్డ్ కప్ జరుగుతోంది కదా. దీంతో క్రికెట్ ప్రియులందరి దృష్టి ఆ మ్యాచులపైనే ఉంది. వెంకీ కూడా ఒక మ్యాచ్ చూసేందుకు ప్లాన్ చేసుకున్నారట. జూన్ 9 న లండన్ లో ఇండియా - ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ చూసేందుకు వెంకీ లండన్ వెళ్తారట. ప్రస్తుతం 'వెంకీమామ' సెకండ్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు వెంకీ. అది పూర్తి కాగానే లండన్ విమానం ఎక్కుతారట. మరోవైపు మహేష్ బాబు ప్రస్తుతం యూరోప్ టూర్ లోనే ఉన్నారు. మ్యాచ్ సమయానికి వెంకటేష్ తో జాయిన్ అవుతారట. సో.. చిన్నోడు పెద్దోడు కలిసి ఆ మ్యాచ్ ను ఎంజాయ్ చేసేందుకు ప్లాన్ చేశారన్నమాట.

మహేష్ జూన్ మూడవవారంలో యూరోప్ టూర్ నుండి తిరిగి వస్తారట. మహేష్ కొత్త సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ఈమధ్యే లాంచ్ అయింది కదా. ఈ సినిమా రెగ్యులర్ షూట్ జూన్ ఆఖరు నుండి ప్రారంభం అవుతుందని సమాచారం.