Begin typing your search above and press return to search.

మీరు సినిమా చూసినా ఆ విషయం చెప్పొద్దు ప్లీజ్‌

By:  Tupaki Desk   |   3 March 2022 6:38 AM GMT
మీరు సినిమా చూసినా ఆ విషయం చెప్పొద్దు ప్లీజ్‌
X
సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రతి ఒక్క దర్శకుడు కూడా నేను తీసిన సినిమా చాలా బాగుంటుంది.. తప్పకుండా మీ అందరిని ఆకట్టుకుంటుంది. మీరు మాత్రమే కాకుండా మరి కొంత మందికి కూడా ఈ సినిమాను చూపించాలంటూ విజ్ఞప్తి చేయడం మనం పలు ఇంటర్వ్యూలో చూశాం. కాని తమిళ చిత్రం ఈటీ చిత్ర దర్శకుడు చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది.

సూర్య హీరోగా ప్రియాంక మోహన్ అరూల్ హీరోయిన్ గా పాండి రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఈటీ'. అదే టైటిల్‌ తో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళంలో విడుదల అయిన సమయంలోనే తెలుగు లో కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సమయంలో సినిమా ప్రమోషన్స్ అక్కడ ఇక్కడ జోరుగా సాగుతున్నాయి.

తాజాగా ఒక ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో చిత్ర దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ ఈ సినిమా చూసిన వారు దయచేసి క్లైమాక్స్ ను రివీల్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు. సినిమా క్లైమాక్స్ ను చూడని ప్రేక్షకులకు రివీల్‌ చేయడం ద్వారా చూడాలనే ఆసక్తి కలుగక పోవడం లేదంటే.. సినిమా చూస్తున్న సమయంలో థ్రిల్‌ ఫీల్‌ కలుగక పోవడం అవుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.

దర్శకుడు ఎంతగా విజ్ఞప్తి చేసినా కూడా ఈటీ కి సంబంధించిన క్లైమాక్స్ ఈజీగానే రివీల్‌ అవుతుందని అంతా అంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ సినిమా కు సంబంధించిన విషయాలను సూర్య అభిమానులు స్వయంగా క్లైమాక్స్ గురించి చర్చించుకునే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు విజ్ఞప్తి మేరకు అయినా వారు సినిమా క్లైమాక్స్ విషయంలో లీక్ చేయకుండా ఉంటారేమో చూడాలి.

సూర్య గత చిత్రాలు ఆకాశమే నీ హద్దురా మరియు జై భీమ్‌ సినిమాలు సూపర్‌ హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈటీ అంటే ఎవరికి తల వంచని వాడు అంటూ టైటిల్‌ తో రాబోతున్న సూర్య లుక్ చాలా విభిన్నంగా ఉంది.

ట్రైలర్‌ మరియు పోస్టర్స్ సినిమా పై ఆసక్తి పెంచాయి. కనుక ఈటీ తెలుగు లో కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఈనెల 10వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.