ఇటలీలో ఇండియన్ పెళ్లి.. రూ.140 కోట్ల ఖర్చు

Update: 2015-11-30 09:03 GMT
కోటీశ్వరుల ఇంట్లో పెళ్లిళ్లకు చేస్తున్న ఖర్చు గురించి వింటే నోరెళ్లబెట్టాల్సిందే. ఇటీవల కేరళలో ఓ బిలియనీర్ కూతురి పెళ్లి కి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్ తో సెట్ వేయించడం... ఏకంగా రూ.55 కోట్లు ఖర్చు చేయడం తెలిసింది. ఆయన్ను మించిపోయాడు ఇంకో ఇండియన్ బిలియనీర్.  ఇటలీలోని ఫ్లోరెన్స్ లో నివసించే ఇండియన్ బిలియనీర్ యోగశ్ మెహతా తన కుమారుడు రోహన్ మెహతా వివాహాన్ని మరింత గ్రాండ్ గా జరిపించాడు. ఆ పెళ్లికి ఆయన ఏకంగా రూ.140 కోట్లు ఖర్చ చేయడం విశేషం. మొన్న 27వ తేదీ నుంచి మొదలై మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ పెళ్లికి 500 మంది హాజరయ్యారట. రోహన్ మెహతా పెళ్లి వేడుకను చూసి ఇటలీయే అదిరిపోయింది.

అయితే.. ఖర్చు, ఆడంబరాలతో పాటు ఆ పెళ్లిలో భారతీయత కూడా కనిపించింది. వచ్చిన అతిథులంతా భారతీయ సంప్రదాయ దుస్తులే ధరించారట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగేష్ మిత్రులు, కుటుంబ సన్నిహితులు ఫ్లారెన్స్‌‌కు చేరుకొని వధూవరులను ఆశీర్వదించారు. యోగేష్ మెహతా  దుబాయ్‌‌ లో అతిపెద్ద పెట్రోలియం కంపెనీని నడిపిస్తున్నారు. ఆయనకు వేల కోట్ల డాలర్ల ఆస్తులున్నాయి. కొడుకు రోహన్ పెళ్లి గ్రాండ్ గా చేసిన ఈయన వియ్యమొందని వ్యక్తి కూడా ఆయనతో సమ ఉజ్జీయైన భారతీయుడే. మరోవైపు పెళ్లికుమారుడిని ఏనుగుపై ఊరేగించాలని అనుకున్నా ఫ్లోరెన్స్ నగర అధికారులు జంతు పరిరక్షణ నిబంధనల కారణంగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
Tags:    

Similar News