ఆ మాజీ ఎంపీనే ఆత్మాహుతి దాడి చేశారట

Update: 2016-07-27 16:41 GMT
అత్యంత కీలకమైన స్థానంలో బాధ్యతలు నిర్వర్తించిన ఒక ఎంపీ చివరకు ఆత్మాహుతి సభ్యుడిగా మారటమేకాదు.. ఎయిర్ పోర్ట్ లో మానవబాంబులా మారి ఏకంగా మారణహోమనికి తెర తీయటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎంపీగా బాధ్యతుల నిర్వర్తించిన 53 ఏళ్ల సామాలియా నేత సలా బాడ్బాడో ఆల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థలో చేరారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు మీడియా సమావేశం పెట్టిన ఇతగాడు.. తర్వాతికాలంలో పెద్ద కనిపించలేదు. తాజాగా ఎయిర్ పోర్ట్ దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో ఈ మాజీ ఎంపీని గుర్తించిన భద్రతా సిబ్బంది షాక్ తినే పరిస్థితి.

మాజీ ఎంపీ అయి ఉండి సూసైడ్ బాంబర్ గా మారటమేంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇక.. ఆత్మాహుతి దాడి విషయానికి వస్తే.. ఎయిర్ పోర్ట్ ప్రధాన బేస్ వద్దకు 200 మీటర్లు దూరంలో తనతో పాటుగా వాహనాన్ని పేల్చేసిన ఈ మాజీ దుర్మార్గపు చర్యతో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన దుస్థితి. ఈ ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్యసమితి సైతం తీవ్రంగా ఖండించింది.
Tags:    

Similar News