చెప్పే మనిషికి ఒక వ్యాల్యూ ఉండాలి: రోజా

Update: 2019-02-27 17:26 GMT
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నాయకురాలు.. నగరి ఎంఎల్ఎ రోజా గురించి కొత్తగా ఎవరికీ ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు.  సినీ నటిగా కెరీర్ మొదలు పెట్టి టాప్ హీరోల అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న రోజా ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన ముద్రవేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. తాజాగా ఒక వెబ్ ఛానల్ వారు రోజాను ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేశారు.

ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమోలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు తడుముకోకుండా చకచకా జవాబులిచ్చారు రోజా.
 
*జగన్ గారు ఒక నియంత లాగా.. కుటుంబానికి 'నేనే అంతా' లాగా ఉంటారు.

రాజశేఖర రెడ్డి గారి గురించి తెలుసుకునేందుకు ప్రజలకు ముప్పై ఏళ్ళు పట్టింది.. కానీ ఐదేళ్ళ పాలనలో 'ఇలాంటి నాయకుడిని మనం గతంలో వదులుకున్నామే' అని అందరూ బాధ పడ్డారు. అలాగే  జగన్ గారి గురించి అందరూ తెలుసుకుంటారు.

* జగన్ గారి పైన ఉన్న కేసులన్నీ డబ్బుకు సంబంధించినవే. త్వరలో ఈ కేసులన్నిటినుంచి నిర్దోషిగా బయటకు రాబోతున్నారంటారా?

జగన్ మోహన్ రెడ్డిగారు తప్పు చేసి ఉంటే ఈపాటికి ఎప్పుడో ప్రూవ్ అయిపోయిఉండేది.

*వైసీపీ ఫౌండర్ నే జగన్ గారు బయటకు పంపారని అంటున్నారు?

తెలుగు దేశం వారి మాయలో పడి చెప్పాడేమో.

*అసెంబ్లీ లో ఉండి ప్రతిపక్ష నేతగా జగన్ ఫెయిల్ అవుతూ ఉన్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు

చెప్పే మనిషికి ఒక వ్యాల్యూ ఉండాలి.  18 సీట్లు వస్తే కూడా ఉండలేక.. ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పారిపోయిన వాళ్ళకు మాట్లాడే అర్హత ఉంటుందా?

*మీరు చేసే విమర్శల్లో నాగబాబు పేరు కూడా ఉంటుంది. కాయన ఆయన మీపక్కనే కూర్చుని ఓ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆయనతో కూర్చున్నప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించదా?

ఎప్పుడు హాయ్.. హలో.. బై తప్ప ఎక్కువగా మేము మాట్లాడుకునే అవకాశం రాదు.

ప్రోమోలోనే ఈ ప్రశ్నలు సమాధానాలు ఇంత హాట్ హాట్ గా ఉన్నాయంటే.. ఫుల్ ఇంటర్వ్యూలో రోజా తనను ఎందుకు ఫైర్ బ్రాండ్ అంటారో మరోసారి ప్రూవ్ చేయడం ఖాయమే.. అంతలోపు ప్రోమో చూసేయండి.


Full View
Tags:    

Similar News