కరోనా వేళ: జనాలకు పోలీస్ ఎంటర్ టైన్ మెంట్

Update: 2020-04-05 01:30 GMT
దేశంలో కరోనా వైరస్ కారణంగా మొత్తం లాక్ డౌన్ చేశారు. జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో అడుగు బయటపెట్టలేని జనాలు ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే జనాలను ఎంటర్ టైన్ చేయడానికి గుజరాత్ పోలీసులు ఓ కొత్త పద్ధతి ఎంచుకున్నారు.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని వస్త్రాపూర్ పోలీసులు తమ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలను ఎంటర్ టైన్ చేయడానికి ఓ లోకల్ సింగర్ ను రంగంలోకి దించారు. డీజే ట్రాక్ తో పాటు వీధివీధికి తిరుగుతూ అతడితో ప్రదర్శనలు ఇప్పించారు.  ఆ సింగర్ గిటార్ వాయిస్తూ బాలీవుడ్ సంగీత దిగ్గజాల ఆల్ టైమ్ రికార్డులతోపాటు లేటెస్ట్ పాటలు పాడి అక్కడి ప్రజల్ని ఉర్రూతలూగించాడు.

ఈ సందర్భంగా భవనాల్లో ఉన్న జనాలు బయటకు వచ్చి అతడి పాటలు వింటూ.. చప్పట్లతో సింగర్ ను ఉత్సాహపరిచాడు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పోలీసుల ప్రయత్నాన్ని నెటిజన్లు కొందరు అభిమానించగా.. వ్యంగ్యంగా కొందరు కౌంటర్లు ఇచ్చారు. ఇటలీలో ఇలా చేశారంటూ కొందరు కాపీ అంటూ ఆడిపోసుకున్నారు.
Tags:    

Similar News