ఒక మహిళ ఆత్మహత్య ఆ రాష్ట్ర మంత్రి పదవి ఊడేలా చేసింది. మహిళ ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి? రాష్ట్ర మంత్రి రాజీనామా చేయటం ఏమిటి? అనుకుంటున్నారా? నిజమే.. మహారాష్ట్ర అటవీ శాఖా మంత్రి సంజయ్ రాథోడ్ తాజాగా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన వైనం సంచలనంగా మారింది. దీనికి కారణం ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవటమే. దీనికి బీజేపీ చేస్తున్న తీవ్ర విమర్శలు.. ఆరోపణలతో ఆయన తన పదవికి రాజీనామా చేసేశారు.
మహిళ మరణంపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండి పడుతున్నారు. రాష్ట్రంలోని బీడ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల పూజా చవాన్ ఫిబ్రవరి 8న ఫూణెలోని భవనం మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. అయితే.. ఆమె మంత్రి సంజయ్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొంటూ విపక్ష బీజేపీ మండిపడుతోంది.
విపక్షం ఆరోపణలు చేసినంతనే సదరు మంత్రిగారు రాజీనామా చేయలేదు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటకు రావటం.. అవి కాస్తా సంచలనంగా మారటంతో.. ఒత్తిడి పెరిగిపోయిన మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. ఇంతకూ బయటకు వచ్చిన వివరాలేమిటంటే.. ఆత్మహత్య చేసుకున్న మహిళతో మంత్రి మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులు.. ఫోటోలు.. వీడియోలు లీక్ అయ్యాయి.
అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రంలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పాలిస్తోంది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సీఎంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవిని ఊడబీకిన ఆమె మరణం.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మహిళ మరణంపై నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండి పడుతున్నారు. రాష్ట్రంలోని బీడ్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల పూజా చవాన్ ఫిబ్రవరి 8న ఫూణెలోని భవనం మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. అయితే.. ఆమె మంత్రి సంజయ్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లుగా పేర్కొంటూ విపక్ష బీజేపీ మండిపడుతోంది.
విపక్షం ఆరోపణలు చేసినంతనే సదరు మంత్రిగారు రాజీనామా చేయలేదు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు బయటకు రావటం.. అవి కాస్తా సంచలనంగా మారటంతో.. ఒత్తిడి పెరిగిపోయిన మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. ఇంతకూ బయటకు వచ్చిన వివరాలేమిటంటే.. ఆత్మహత్య చేసుకున్న మహిళతో మంత్రి మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులు.. ఫోటోలు.. వీడియోలు లీక్ అయ్యాయి.
అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో.. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రంలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పాలిస్తోంది. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సీఎంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవిని ఊడబీకిన ఆమె మరణం.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.