లోటస్‌ పాండ్‌ కు మంచు హీరో

Update: 2019-02-14 13:00 GMT
యంగ్‌ హీరో మంచు విష్ణు తాజాగా భార్య సమేతంగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ను కలిశాడు. లోటస్‌ పాండ్‌ కు భార్య విరోనికాతో కలిసి వెళ్లిన మంచు విష్ణు దాదాపు రెండు గంటల పాటు అక్కడే గడిపినట్లుగా తెలుస్తోంది. వైఎస్‌ ఫ్యామిలీకి విరోనికా దగ్గర బంధువు అనే విషయం తెల్సిందే. వైకాపా తరపున మంచు ఫ్యామిలీ నుండి ఒకరు ఎన్నికల బరిలోకి దిగుతారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో మంచు విష్ణు లోటస్‌ పాండ్‌ కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

ఏపీ రాజకీయం రసకందాయంలో ఉంది, వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలుపు ఖాయం అంటూ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో జగన్‌ రాజకీయ భేటీలతో చాలా బిజీగా ఉన్నారు. పాదయాత్ర ముగించుకుని వచ్చిన జగన్‌ ను మర్యాదపూర్వకంగా మంచు విష్ణు, విరోనిక కలిశారంటూ వైకాపా వర్గాల వారు చెబుతున్నారు. విష్ణు, జగన్‌ ల భేటీలో ఏ విషయాలు చర్చకు వచ్చాయి అనే విషయంపై పూర్తి క్లారిటీ అయితే రాలేదు. అయితే ఈ భేటీ సినీ మరియు రాజకీయ వర్గాల్లో మాత్రం ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News