తాగి కొడుతోందని భార్య పై ఫిర్యాదు

Update: 2020-09-19 17:00 GMT
ఎక్కడైనా తాగి తన్నే మగాళ్లను చూశాం కానీ.. ఇక్కడేంట్రా బాబు.. తాగి భార్యే కొడుతోందట.. నిజంగా నిజమిదీ.. ఈ వింత కేసు గుజరాత్ రాష్ట్రంలో   చోటుచేసుకుంది.

తన భార్య బాగా తాగి హింసిస్తోందని.. ఆమె నుంచి రక్షణ కావాలని పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది.

అహ్మదాబాద్ మునినగర్ కు చెందిన ఓ వ్యక్తికి 2018లో వివాహమైంది. పెళ్లి తర్వాత భార్య తాగుతుందని తెలిసిందతడికి.. ఆమె తాగినప్పుడు అతడిని.. అతడి తల్లిదండ్రులను బాగా తిట్టేది. భర్తను కొట్టేది కూడా..

భార్య తీరుతో మానసికంగా భర్త కృంగిపోయాడు.  . తాజాగా తాగి భర్త పనిచేసే చోటకు వచ్చి గొడవ చేసింది భార్య. దీంతో భార్యను వదిలేసి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు భర్త. దీంతో భర్త, అత్తమామల పై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. భర్తపై తప్పుడు ఆరోపణలు చేసేది.

దీంతో విసిగిపోయిన భర్త తన భార్య తాగి కొడుతోందని.. తాగుబోతు భార్య నుంచి తనను రక్షించాలని పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులను ఆశ్రయించడం విశేషం.
Tags:    

Similar News