73 ఏళ్ల చరిత్రలో తొలిసారి అలా..ఓవైసీ ఎఫెక్ట్ తో బీహార్ కేబినెట్ లో భారీ మార్పులు!
బీహార్ లో ఇటీవలే ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకొని మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ 125 సీట్లను ఎన్డీయే గెలుచుకుంది. ఈ తరుణంలో నితీష్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే సీఎంతో పాటుగా 14 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, నితీశ్ కేబినెట్ లో మైనార్టీలకు చోటు లభించలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత , ముస్లిం వర్గానికి మంత్రి పదవి దక్కకపోవడం బిహార్ రాజకీయ చరిత్ర లో ఇదే మొదటిసారి.
ఈ మద్యే ముగిసిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి బీజేపీ, హిందుస్తానీ అవామ్ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ ముస్లింలకు సీట్లు కేటాయించలేదు. ఇక జేడీయూ తరఫున 115 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. అందులో 11 మంది ముస్లింలు ఉన్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆర్జేడీ ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. కానీ , ఆ స్థానాల్లో ఐదు స్థానాల్లో అసదుద్దీన్ ఓవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అలాగే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ కూడా ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. దీనితో నితీష్ కేబినెట్ లో ముస్లిం వర్గానికి చోటు దక్కలేదు.
ఇకపోతే , 2015 ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీకి 24 మంది ముస్లింలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. ప్రస్తుతం అది 19కి పడిపోయింది. అయితే , గత ప్రభుత్వం హయాంలో ముస్లింల కోసం నితీష్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని నీ తమ పార్టీ తరఫున పోటీ చేసిన 11 మంది ముస్లింలకు వారు మద్దతుగా నిలవలేదు అని బిహార్ కేబినెట్ లో ముస్లింలకు చోటు దక్కకపోవడానికి ముస్లింలే కారణమని జేడీయూ మైనార్టీ సెల్ అధ్యక్షుడు తన్వీర్ అక్తర్ తెలిపారు
ఈ మద్యే ముగిసిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి బీజేపీ, హిందుస్తానీ అవామ్ మోర్చా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ ముస్లింలకు సీట్లు కేటాయించలేదు. ఇక జేడీయూ తరఫున 115 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. అందులో 11 మంది ముస్లింలు ఉన్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆర్జేడీ ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. కానీ , ఆ స్థానాల్లో ఐదు స్థానాల్లో అసదుద్దీన్ ఓవైసీకి చెందిన మజ్లిస్ పార్టీ ఘనవిజయం సాధించింది. అలాగే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఖుర్షీద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ కూడా ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఎన్డీయే కూటమి నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. దీనితో నితీష్ కేబినెట్ లో ముస్లిం వర్గానికి చోటు దక్కలేదు.
ఇకపోతే , 2015 ఎన్నికల్లో బిహార్ అసెంబ్లీకి 24 మంది ముస్లింలు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. ప్రస్తుతం అది 19కి పడిపోయింది. అయితే , గత ప్రభుత్వం హయాంలో ముస్లింల కోసం నితీష్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని నీ తమ పార్టీ తరఫున పోటీ చేసిన 11 మంది ముస్లింలకు వారు మద్దతుగా నిలవలేదు అని బిహార్ కేబినెట్ లో ముస్లింలకు చోటు దక్కకపోవడానికి ముస్లింలే కారణమని జేడీయూ మైనార్టీ సెల్ అధ్యక్షుడు తన్వీర్ అక్తర్ తెలిపారు