ఈటలకు అస్వస్థత.. నిమ్స్ కు తరలింపు

Update: 2021-07-30 13:33 GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్  స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ లోని నిమ్స్ కు ఆయనను తరలించారు. బీపీ పడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళుతున్నామని వైద్యులు తెలిపారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అందరికంటే ముందే ఈటల రాజేందర్ ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.నియోజకవర్గంలో 'ప్రజాదీవెన' పాదయాత్రను చేపట్టారు. ఈ క్రమంలోనే ఊరువాడ పొలాల వెంబడి తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈటల కాళ్లకు పొక్కులు, జ్వరం రావడంతో పాదయాత్రలో  ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల నుంచి మధ్యాహ్న భోజన విరామం సమయంలో ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం రెండు గ్రామాల్లో ఈటల సతీమణీ జమున తాజాగా పాదయాత్ర చేపట్టారు. ఈటలకు బదులుగా ఆమె పాదయాత్ర చేపట్టారు.గురువారం జమ్మికుంట మండలం విలాసాగర్, పాపయ్యపల్లి, బిజిగిరిషరీఫ్, వెంకటేశ్వర్ల పల్లి , కాపులపల్లి, కోరపల్లి, సైదాబాద్ గ్రామాల్లో ప్రజాదీవెన పాదయాత్ర కొనసాగింది.
Tags:    

Similar News