ఆయన్ను తరిమి తరిమి కొడతారట

Update: 2016-12-04 12:01 GMT
దూకుడు రాజకీయాల్లో తూటాల్లాంటి మాటలతో మీడియాను.. ప్రజల్ని ఆకర్షించాలన్న దుగ్ధ ఈ మధ్యన రాజకీయ నేతల్లో మరింత పెరగుతోంది. ఏదో పని మీద హాట్ హాట్ వ్యాఖ్యలు చేయటం.. సరికొత్త హీట్ జనరేట్ చేయటం అదో అలవాటుగా మారుతోంది. నోట్ల రద్దుపై మమతా బెనర్జీతో పాటు.. కమ్యూనిస్టులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ చట్టానికి ఇటీవల చేసిన మార్పుల నేపథ్యంలో.. బంగారంపై పరిమితి పెట్టినట్లుగా సాగుతున్న హడావుడి ప్రచారానిక కొన్ని మీడియా సంస్థలు సారథ్యం వహిస్తే.. ఇప్పుడు కామ్రేడ్లు ఇందులో జాయిన్ అయినట్లుగా కనిపిస్తోంది.

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బంగారం జోలికి వెళితే.. మహిళలు మోడీని పరకలతో తరిమితరిమి కొడతారని హెచ్చరించటం గమనార్హం. బంగారం జోలికి వస్తే.. మోడీని మహిళలే తరిమితరిమి కొట్టేయటం ఖాయమని తేల్చేశారు. పెద్దనోట్లరద్దుతో ప్రజల్ని సమస్యల్లోకి నెట్టేశారన్న రామకృష్ణ.. చిల్లర నోట్లు లేక సామాన్యులు ఇబ్బంది పడుతుంటే.. కోట్లాది రూపాయిలు వెచ్చింది చేస్తున్న పెళ్లిళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్న విమర్శ చేశారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ.. ఎమ్మెల్యే యరపతనేని.. మైనింగ్ బారెన్ గాలి జనార్ధన్ రెడ్డిలు కోట్లు ఖర్చు పెట్టి.. పెళ్లిళ్లు ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వారు చేస్తున్న వివాహ వేడుకలపై ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించటం లేదన్న ప్రశ్నను ఆయన సంధించారు. ఇక.. జనసేన పార్టీకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై కమ్యూనిస్టులు.. జనసేన ఎజెండా ఒక్కటేనని.. కలిసి పని చేయనున్నట్లు వెల్లడించారు.


Tags:    

Similar News