దిశ నిందితుల ఎన్ కౌంటర్ మీద సీపీఐ నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు

Update: 2019-12-06 05:48 GMT
మారే కాలంతో పాటు కామ్రేడ్లు మారటం లేదని.. అదే వారి పతనానికి కారణంగా తరచూ విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. ఈ విషయాన్ని గ్రహించారో.. జనాగ్రహానికి భిన్నంగా స్పందిస్తే తమకిక పుట్టగతులు ఉండవన్న నిజాన్ని తెలుసుకున్నారో కానీ.. తాజాగా బయటకు వచ్చిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఎన్  కౌంటర్లపై పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించే వారిలో కమ్యునిస్టు నేతలు ముందుంటారు. చట్టం తన పని తాను చేయాలని.. తప్పు చేసిన వారిని శిక్షించేందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్న వాదనను తరచూ వినిపిస్తుంటారు. ఏదైనా ఘోరం జరిగినప్పడు కూడా మానవహక్కుల గురించి మాట్లాడటం.. బాధితుల వేదనను వదిలేసి.. నిందితుల తరఫున వకల్తా పుచ్చుకునే తీరుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు సీపీఐ నారాయణ.

తాజాగా వాట్సాప్ లో ఆయనో సందేశాన్ని విడుదల చేశారు. దిశ నిందితుల్ని పోలీసులు హతమార్చటం ఆనందించదగిన అంశంగా ఆయన పేర్కొన్నారు.దిశ లాంటి దారుణ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితుల ఎన్ కౌంటర్ తప్పేం కాదన్న అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. సంతోషం.. శుభం.. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటివి తప్పవు. కొన్ని లా అండ్ ఆర్డర్ సమస్యలు రావొచ్చు కానీ ఈ సమయంలో ఎన్ కౌంటర్ గురించి మరో మాట మాట్లాడటానికి లేదు. ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా ఉండాలంటే హతమార్చటం అవసరం.. దీన్ని మేం పూర్తిగా సమర్థిస్తున్నామని వ్యాఖ్యానించి షాకిచ్చారు నారాయణ. ఇంతకాలానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారో సరిగ్గా దాన్నే తన నోటి నుంచి నారాయణ వెల్లడించటం విశేషంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News