మహమ్మారిని జయించిన వీహెచ్ దంపతులు

Update: 2020-07-02 06:30 GMT
అరె ఏందిర బై.. కురువృద్ధుడినైనా నన్ను కరోనా పట్టుడేందిర బై.. అందుకే ఫైట్ చేసిన జయించిన.. అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు. తాజాగా వీహెచ్ తోపాటు ఆయన భార్యకు కూడా కరోనా ను జయించి విజయవంతంగా కోలుకున్నారు.

జూన్ 21న వీరిద్దరికి పాజిటివ్ రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో వారిద్దరూ చేరారు. 10 రోజుల తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు.  దీంతో కరోనాను వీహెచ్ అంత లేటు వయసులో జయించడం విశేషంగా మారింది.

జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్దతుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లినప్పుడు వీహెచ్ కు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.

ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు పద్మారావు, ముత్తిరెడ్డి,బాజిరెడ్డి, గణేష్ గుప్తాలు కరోనా బారినపడ్డారు. వీహెచ్ వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఆ వయసు వారికి ప్రమాదకరమైనా కూడా జయించి అందరికీ స్ఫూర్తిని నింపారు.
Tags:    

Similar News