వెరైటీ: మాస్కులతో మంత్రికి సన్మానం

Update: 2020-07-11 17:31 GMT
అసలే ఇది కరోనా కాలం.. అటు ఇటూ అయితే కాటికిపోయే కాలం. అందుకే అందరూ ఇప్పుడు మాస్క్ లు, శానిటైజర్లు, హ్యాండ్ వాష్ లు, జాగ్రత్తల గురించే మాట్లాడుతున్నారు. రాజకీయ నేతలు కరోనా భయానికి బొత్తిగా పర్యటనలు మానేసి వారు కూడా రాజకీయం ఫ్రం హోం చేస్తున్నారు.

ఇక రాకరాక కరోనా టైంలో ఊరికి వచ్చిన రాష్ట్ర మంత్రికి వినూత్నంగా సన్మానించారు. సాధారణంగా పూలదండలు.. కాస్లీ అనుకుంటే డబ్బుల దండలు వేయాల్సిన గ్రామస్థులు ఆ మంత్రికి ఏకంగా మాస్కులతో దండవేశారు. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులను ఆరాతీయడానికి గ్వాలియర్ కు వచ్చిన రాష్ట్రమంత్రి ప్రద్యుమాన్ సింగ్ కు అక్కడి బీజేపీ కార్యకర్తలు మాస్కులతో మాల వేసి స్వాగతం పలికారు. ఇది అందరినీ ఆకట్టుకుంది.

అనంతరం మంత్రి స్థానిక ప్రజలకు మాస్క్ లను, శానిటైజర్లను పంపిణీ చేశారు.
Tags:    

Similar News