బీజేపీని ఘోరీ మహ్మద్ తో పోల్చేశారు!

Update: 2019-11-19 07:07 GMT
భారతీయ జనతా పార్టీపై దుమ్మెత్తి పోస్తూ ఉంది శివసేన. ఆ పార్టీ అధికారిక పత్రిక 'సామ్నా'లో అయితే బీజేపీని తీవ్రంగా నిందిస్తూ  ఉంది సేన. తమ రాజకీయ ప్రత్యర్థులపై సామ్నాలో విరుచుకుపడటం శివసేనకు అలవాటే. ఈ క్రమంలో బీజేపీ మీద ఆ పార్టీ ఆ పత్రికలో ఫైర్ అయ్యింది.

విశేషం ఏమిటంటే..ఈ సారి బీజేపీని ఘోరీ మహ్మద్ తో పోల్చింది సామ్నా. శివసేనను పృథ్విరాజ్ గా అభివర్ణిస్తూ, బీజేపీని ఘోరీ మహ్మద్ తో పోల్చింది ఈ పత్రిక.

ఘోరీ మహ్మద్ ను పృథ్విరాజ్ పలు సార్లు క్షహించారని, వరసగా దండెత్తుతున్నా ప్రతి సారీ ఓడించి, చంపకుండా వదిలేశారని… అదే ఆయన చేసిన పొరపాటు అని సామ్నా అభిప్రాయపడింది. అలాగే తాము కూడా భారతీయ జనతా పార్టీని ఇన్నేళ్లూ ఎంటర్ టైన్ చేసి తప్పు  చేసినట్టుగా ఆ పార్టీ  పత్రిక చెప్పుకొచ్చింది.

ఇది భారతీయ జనతా పార్టీకి బాగా ఇబ్బందికరమైన విమర్శే. తీవ్రమైన మాటలతో శివసేన బీజేపీని విమర్శిస్తూ ఉంది. ఘోరీ మహ్మద్ ను బీజేపీ తీవ్రంగా ద్వేషిస్తుంది. అలాంటి ఘోరీతో ఆ పార్టీనే పోల్చింది శివసేన. మరి దీనిపై కమలం పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో!
Tags:    

Similar News