భార్య ఐదో పెళ్లి.. నాలుగో భర్త సూసైడ్

తన భార్య ఐదో పెళ్లి చేసుకున్న వైనంపై సునీల్ కుంగిపోయాడు. ఈ క్రమంలో గత వారం ఒక సూసైడ్ నోట్ రాసేసిన అతను.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు.

Update: 2024-01-15 11:30 GMT

ఇదో సిత్రమైన విషాదం. భార్యభర్తల మధ్య గొడవలు రావటం.. పుట్టింటికి వెళ్లిపోవటం.. అవసరమైతే ఒక కేసుతో భర్తకు సినిమా చూపించటం తెలిసిందే. ఇప్పుడు చెప్పే ఉదంతం అయితే ఆ తర్వాతి లెవల్. మద్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. ఐదో పెళ్లి చేసుకున్న భార్య తీరుతో వేదన చెందిన నాలుగో భర్త ఆత్మహత్యకు పాల్పడటం షాకింగ్ గా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఇండోర్ కు చెందిన 35 ఏళ్ల సునీల్.. 2018లో ఒక మహిళను పెళ్లాడారు. అయితే.. అతను ఆమెకు నాలుగో భర్త. అంతకు ముందు మూడుసార్లు ఆమెకు పెళ్లై.. భర్తలతో విడాకులు తీసుకుంది. పెళ్లైతే అయ్యింది కానీ.. వారిద్దరి మధ్య పొసిగేది కాదు. దీంతో.. ఆమె గత ఏడాది తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పెళ్లాడింది.

తన భార్య ఐదో పెళ్లి చేసుకున్న వైనంపై సునీల్ కుంగిపోయాడు. ఈ క్రమంలో గత వారం ఒక సూసైడ్ నోట్ రాసేసిన అతను.. సోషల్ మీడియాలో షేర్ చేసి.. పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. అతడ్ని రక్షించిన కొందరు.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఒళ్లు బాగా కాలిపోవటంతో.. అతను మరణించాడు. అతడి ఆత్మహత్యకు కారణం.. తన భార్య ఐదో పెళ్లి చేసుకోవటం ఒక ఎత్తు అయితే.. తనపై వరకట్నం వేధింపులకు గురి చేసినట్లుగా కోర్టులో కేసు వేయటంతో విసిగిపోయిన అతను.. ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News