తెలంగాణ గ్రహ చారం బాగోక రేవంత్ సీఎం అయ్యిండు: కవిత
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజైనా రేవంత్రెడ్డి జై తెలంగాణ అని అనాలని కవిత డిమాండ్ చేశారు.;

తెలంగాణ గ్రహ చారం బాగోలేక రేవంత్రెడ్డి సీఎం అయ్యారని.. బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ ఉద్యమ కారులపై.. కర్రెత్తిన రేవంతరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం దారుణమ ని అన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగామీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తమ కార్యాలయం అశోక్నగర్లో ఉందన్నారు.
అయితే.. మరింత సౌలభ్యం కోసం.. బంజారాహిల్స్లో ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక్కడ ఎక్కువ కాలం లీజుకు తీసుకున్నామని.. కాబట్టి ఎక్కువ కాలం ఇక్కడే కార్యాలయం ఉంటుందన్నారు. తమ జాగృతి సం స్థ ఉద్యమ సమయంలోనే పుట్టిందన్నారు. అనేక సమస్యలపై తెలంగాణ జాగృతి పోరాటం చేసిందన్నా రు. గత ప్రభుత్వంలో తమకు అన్ని విషయాల్లో సహకారం అందినట్టు చెప్పారు. ``జై తెలంగాణ అనని ఓ ముఖ్యమంత్రి నేడు తెలంగాణను పాలిస్తున్నాడు`` అని రేవంత్పై విమర్శలు గుప్పించారు.
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంఘనంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆ రోజైనా రేవంత్రెడ్డి జై తెలంగాణ అని అనాలని కవిత డిమాండ్ చేశారు. అదేరోజు `రాజీవ్ యువవికాసం` పథకం ప్రారంభిస్తామ ని సీఎం ప్రకటించారన్నారు. కానీ, రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులైన శ్రీకాంతాచారి.. మనోహర్రెడ్డి, దొడ్డికొమరయ్య వంటి వారి పేర్లు పెట్టాలని.. లేకపోతే.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరైనా పెట్టాలని కోరారు.
తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాళేశ్వరం కమిషనా? కాంగ్రెస్ కమిషనా? అని ప్రశ్నించారు. ఆనాడు ఒంటి చేత్తో తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమిం చబట్టే.. తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ రాబట్టే.. నేడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని.. వ్యాఖ్యానిం చారు. తెలంగాణ రాకుంటే వీరంతా ఎక్కడుండే వాళ్లని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం 200 టీఎంసీల నీటిని తీసుకుపోతుంటే కూడా.. రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదని చెప్పారు. నదుల అనుసంధానం అనేది కేవలం కంటితుడుపు మాత్రమేనని.. ఇది నీటి దోపిడీనేనని అయినా.. రేవంత్ మౌనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు.