నా అల్లుడే దుర్మార్గుడు: అంబ‌టి

''నా అల్లుడే దుర్మార్గుడు. నా కూతురిని వ‌దిలేశాడు. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కూడా వ‌దిలేశాడు.

Update: 2024-05-06 04:01 GMT

''నా అల్లుడే దుర్మార్గుడు. నా కూతురిని వ‌దిలేశాడు. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కూడా వ‌దిలేశాడు. అత‌నా న‌న్ను విమ‌ర్శించేది. దీని వెనుక ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నాడు. ఆయ‌నే ఆడిస్తున్నాడు'' అంటూ.. మంత్రి, స‌త్తెనప‌ల్లి వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబు ఫైర‌య్యా రు. ఆదివారం ఉద‌యం.. అంబటి అల్లుడు డాక్ట‌ర్ గౌత‌మ్‌.. ఓ సెల్ఫీ వీడియో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దీనిలో ఆయ‌న మంత్రి అంబ‌టిని తీవ్ర‌స్థాయిలో దూషించారు. నీచుడు, దుర్మార్గుడు, నికృష్టుడు అంటూ..వ్యాఖ్యానించారు. ఆయ‌న‌కు ఓటేయొద్ద‌ని కూడా పిలుపునిచ్చారు. అయితే.. ఈ విష‌యం కాస్తా.. తాజాగా స‌త్తెన‌ప‌ల్లిలో ప‌ర్య‌టించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌స్తావించారు.

అంబ‌టిని ఆయ‌న అల్లుడే తిట్టాడ‌ని అన్నారు. అంతేకాదు.. సెల్ఫీవీడియో విష‌యం కూడా ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. దీంతో ఈ విష‌యంపై అంబ‌టి ఫైర‌య్యారు. త‌న అల్లుడు తిట్టినందుకు కాదు.. ప‌వ‌న్ ప్ర‌స్తావించినందుకు తాను మాట్లాడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు. త‌న అల్లుడే దుర్మార్గుడ‌ని.. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత‌.. త‌న కుమార్తెకు విడాకులు ఇస్తానంటూ కోర్టుకు వెళ్లాడ‌ని చెప్పారు. అయినా.. తాను భ‌య‌ప‌డ‌కుండా.. త‌న కుమార్తె, వారి పిల్ల‌ల భ‌విష్య‌త్తును కూడా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఆది నుంచి కూడా త‌న అల్లుడు గౌత‌మ్‌.. టీడీపీకి, ప‌వ‌న్‌కు అనుకూల‌మ‌ని.. ఆయా పార్టీల్లో చేర‌తాన‌ని చెప్పేవాడ‌ని అన్నారు.

Read more!

చివ‌ర‌కు ఎన్నిక‌ల‌కు వారం ముందు.. ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలో సెల్ఫీ వీడియో తీసి త‌న ప‌రువు తీశార‌ని అన్నారు. దీనికి ప‌వ‌న్ ఒత్తాసు ప‌లుకుతున్నార‌ని చెప్పారు. అయితే.. త‌న అల్లుడు, కూతురు కూడా రాజ‌కీయ నాయ‌కులు కానందున తాను భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ఇదే స‌మ‌యంలో ప‌లువురి కుటుంబాల వ్య‌వ‌హారాన్ని కూడా అంబ‌టి ప్ర‌స్తావించారు. చిరంజీవి కుటుంబంలో కుమార్తెలు లేరా.. వారి కుటుంబాలు స‌క్ర‌మంగా ఉన్నాయా? ఇవ‌న్నీ తెలియ‌ద‌ని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు. మీరైనా ప‌వ‌న్‌కు చెప్పాల‌ని చిరును అభ్య‌ర్థించారు.

Tags:    

Similar News