వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్!
ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం తదుపరి చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం తదుపరి చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. `తొలి ప్రేమ` చిత్రంతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన వెంకీ తర్వాత పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ కథల వైపు తన ప్రయాణాన్ని మార్చుకున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ తో `సార్`, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్తో `లక్కీ భాస్కర్` ..తాజాగా సూర్యతో విశ్వనాధ్ అండ్ సన్స్ వంటి బ్లాక్బస్టర్ హిట్లను అందించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా పరాజయమే లేని సరికొత్త ట్రాక్ రికార్డుతో సాగుతున్న వెంకీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు.
ఇంత వరకు వరుసగా పరభాషా స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన వెంకీ అట్లూరి ఈసారి మాత్రం పక్కాగా తెలుగు హీరోతోనే సినిమా చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో తన మార్కెట్ను మరింత విస్తరించుకోవడంతో పాటు ఇక్కడి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే కథను ఆయన సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో టాలీవుడ్లోని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలైన అక్కినేని నాగచైతన్య లేదా నేచురల్ స్టార్ నాని లలో ఒకరితో సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే నాగచైతన్యకు వెంకీ అట్లూరి అద్భుతమైన కథను వినిపించారన్న వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. చైతు కూడా కథకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, ప్రస్తుతం తాను చేస్తున్న ఇతర ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నేచురల్ స్టార్ నాని కూడా వెంకీ చెప్పిన కథకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నాని ప్రస్తుతం లైనప్లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేసే పనిలో ఉన్నారు. నానితో పోల్చితే చైతన్య కొత్త దర్శకులకు ఎవరికీ డేట్లు ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో నాగ చైతన్యతోనే వెంకీ ప్రాజెక్ట్ ముందుగా పట్టాలెక్కే అకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారుట. వెంకీ అట్లూరి ఎంచుకునే కథలలో ఉండే బలమైన భావోద్వేగాలు, సామాజిక అంశాలు , కమర్షియల్ హంగులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గత చిత్రాల విజయాలతో ఆయనపై అంచనాలు భారీగా పెరిగిపోవడంతో కొత్త ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విషయంలో వెంకీ ఏమాత్రం రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తెలుగు హీరోతో ఆయన చేయబోయే సినిమా పూర్తిగా డిఫరెంట్ జానర్లో సాగుతుందని, ప్రేక్షకులకు అపురూపమైన సినిమాటిక్ అనుభూతిని ఇస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇప్పుడున్నయంగ్ మోస్ట్ వాంటెడ్ దర్శకులలో వెంకీ అట్లూరి ఒకరిగా నిలవడానికి ఆయన ప్రతిభే ప్రధాన కారణం. పరభాషా హీరోలతోనే కాకుండా టెర్రిఫిక్ తెలుగు హీరోలతో కూడా తాను అద్భుతాలు చేయగలనని నిరూపించుకోవడానికి ఆయన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మలచబోతున్నారు.