షారుక్​-విజయ్​ కాంబో.. రూ.1500కోట్లు టార్గెట్​..

బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుక్‌ హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్‌' రీసెంట్​గా రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2023-09-17 10:58 GMT

బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారుక్‌ హీరోగా కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్‌' రీసెంట్​గా రిలీజై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతూ దూసుకెళ్తున్న ఈ చిత్రం.. దాదాపు రూ.1000కోట్లు మార్క్ అందుకునే దిశగా పోతోంది. అయితే ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గెస్ట్ రోల్ట్ చేశారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ అది జరగలేదు.

అదే సమయంలో రిలీజ్​కు ముందు దర్శకుడు అట్లీ మాట్లాడుతూ.. భవిష్యత్​లో విజయ్​-షారుక్​ కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేయొచ్చని అన్నారు. అయితే తాజాగా మళ్లీ ఇప్పుడు ఈ కాంబో గురించి తెరపైకి వచ్చింది. ఈ సినిమా గురించి అట్లీ మరోసారి మాట్లాడినట్లు తెలుస్తోంది. జవాన్ సినిమాలో విజయ్​ కెమియో రోల్​ను తాను ఎందుకు స్కిప్​ చేశారో చెప్పారట.

షారుక్ ఖాన్​ ​- విజయ్​ దళపతి కాంబోలో ఓ చిత్రాన్ని సిద్ధం చేసేలా వర్క్ చేస్తున్నట్లు అట్లీ చెప్పారని కథనాలు వచ్చాయి. అందుకే ఈ కామియో రోల్​ను స్కిప్ చేశారట. వీరిద్దరి కాంబో చిత్రం దాదాపు రూ.1500కోట్ల వరకు వసూళ్లను సాధిస్తుందని ఆయన అన్నారట. చూడాలి మరి ఈ కాంబో ఎప్పటికీ సెట్​ అవుతుందో.. సెట్స్​పైకి ఎప్పటికీ వెళ్తుందో...

ఇకపోతే ప్రస్తుతం జవాన్ సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్న షారుక్.. త్వరలోనే తన తదుపరి చిత్రం డంకీ కోసం వర్క్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజ్​కుమార్ హిరాణీ తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశముంది. ఈ చిత్రంతోనూ మరో విజయాన్ని అందుకుని హ్యాట్రిక్​ సక్సెస్​ కొట్టాలని షారుక్ ఆశిస్తున్నారు.

విజయ్ దళపతి త్వరలోనే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో లియో చిత్రంతో అభిమానుల ముందుకు రానున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సంజయ్ దత్ పవర్ ఫుల్​ విలన్​గా కనిపించనున్నారు. త్రిష హీరోయిన్​. అక్టోబర్ 19న సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్​లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News