'కుబేర' బిగ్ అప్డేట్ వచ్చింది చూశారా..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తెలుగు స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన సినిమా 'కుబేర'.;

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తెలుగు స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన సినిమా 'కుబేర'. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటించడంతో టాలీవుడ్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. తమిళ్తో పాటు, తెలుగులో ఏక కాలంలో రూపొందిన కుబేర సినిమాను జూన్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కుబేర సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. నాగార్జున పాత్రతో పాటు ధనుష్ పాత్రపై ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఇద్దరి మధ్య ఉండే సంబంధం, ఇద్దరిని కలిపే పరిస్థితులు చాలా ఆసక్తిగా ఉంటాయని ట్రైలర్ ను చూస్తే అనిపిస్తుంది అంటూ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.
టాలీవుడ్లో చాలా కాలం క్రితమే ఆడియో విడుదల కార్యక్రమాలు కాల గర్భంలో కలిసి పోయాయి. కానీ తమిళనాట ఇంకా ఆడియో విడుదల కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రీ రిలీజ్ ఈవెంట్లు కోలీవుడ్లో ఉండవు. అందుకే కుబేర సినిమాకు చెన్నైలో భారీ ఎత్తున ఆడియో విడుదల కార్యక్రమం ను నిర్వహించేందుకు గాను ఏర్పాట్లు జరిగాయి. కుబేర సినిమా ఆడియో విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. జూన్ 1 న చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ఈ బిగ్ ఈవెంట్ను చేయబోతున్నారు. తెలుగు ఈవెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియ ఈ ఆడియో విడుదల కార్యక్రమం ను నిర్వహించనుంది.
కుబేర ఆడియో విడుదల కార్యక్రమంకు నాగార్జున హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా రష్మిక మందన్న సైతం పాల్గొంటుందని తెలుస్తోంది. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ముగ్గురు ఆడియో విడుదల కార్యక్రమంలో పాల్గొంటే కచ్చితంగా బిగ్ సక్సెస్ కావడం ఖాయం. ధనుష్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధనుష్ తెలుగు దర్శకుడితో కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది. కనుక ఆయన అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను రూపొందించారని ట్రైలర్ను చూస్తే అర్థం అవుతుంది.
సాధారణంగా ధనుష్ సినిమాలు చాలా స్పీడ్గా రూపొందుతూ ఉంటాయి. కానీ కుబేరా సినిమాకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్కి ఏడాది సమయం తీసుకున్నాడు. అలాగే సినిమా షూటింగ్కి సైతం ఎక్కువ సమయం తీసుకున్నాడు. దాంతో ఈ సినిమా ప్రకటించినప్పటి ఇప్పటి వరకు దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ధనుష్ ఫ్యాన్స్ మాత్రమే అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా కుబేరా సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. కుబేర సినిమాతో పాటు ధనుష్ మరో రెండు సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందులో ధనుష్ సొంత దర్శకత్వంలో సినిమా కూడా ఉండబోతుంది.