నిజ జీవిత ఘటనలలో క్రేజీ ఫ్రాంఛైజీ!
నిజ జీవిత ఘటనల ఆధారంగా ఏదైనా సినిమాని రూపొందిస్తే దానికి ఉండే క్రేజ్ వేరుగా ఉంది.;

నిజ జీవిత ఘటనల ఆధారంగా ఏదైనా సినిమాని రూపొందిస్తే దానికి ఉండే క్రేజ్ వేరుగా ఉంది. చాలా నిజ జీవిత కథలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లుగా మారుతున్నాయి. ఇప్పుడు ఖిలాడీ అక్షయ్ కుమార్ అలాంటి ఒక ప్రయత్నం చేస్తున్నామని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతడు నటించిన ఫ్రాంఛైజీ చిత్రం హౌస్ ఫుల్ 5 బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించినా క్రిటిక్స్ నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఇలాంటి సమయంలో అతడు జాలీ ఎల్.ఎల్.బి 3 షూటింగుని వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపాడు.
ఈ చిత్రంలో అర్షద్ వార్షీతో కలిసి అక్షయ్ నటిస్తున్నారు. కథాంశం ప్రకారం.. ఆ ఇద్దరి మధ్యా సంఘర్షణ, కోర్టు గొడవ ఏమిటన్నది తెరపై చూడాల్సి ఉంటుంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ లో రిలీజ్ చేయాలని అక్షయ్ బృందం ప్లాన్ చేస్తోంది. జాలీ ఎల్ఎల్బి 3 నిజ జీవిత సంఘటనల నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్నామని అక్షయ్ కుమార్ ధృవీకరించినట్లు పింక్విల్లా పేర్కొంది. పార్ట్ 1 , పార్ట్ 2లో నిజమైన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పార్ట్ 3 (జాలీ ఎల్ఎల్బి 3)లో కూడా కొన్ని నిజమైన సంఘటనలు ఉన్నాయి! అని అక్కీ అన్నారు. సినిమా గురించి ఏదైనా చెబుతారా? అని ప్రశ్నిస్తే కథంతా చెప్పమంటున్నారా? అని అక్షయ్ మీడియాను ఎదురు ప్రశ్నించారు.
మూడవ భాగంలో జాలీ త్యాగి , జాలీ మిశ్రా మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతుంది. సౌరభ్ శుక్లా న్యాయమూర్తిగా తిరిగి తెరపై కనిపిస్తారు. ఈ చిత్ర కథాంశం సంక్లిష్టమైన, సామాజికాంశం చుట్టూ తిరుగుతుంది. అర్షద్ వార్సీ మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు. చక్కని హాస్యం అతడిలో ఉంది. అతడితో పని చేయడం ఆనందంగా ఉందని అక్షయ్ అన్నారు. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్న జాలీ LLB 3లో హుమా ఖురేషి, అమృతారావు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముంబై, రాజస్థాన్లలో చిత్రీకరించారు. ఈ చిత్రం హాస్యం, యాక్షన్, డ్రామా నేపథ్యంలో రక్తి కట్టించనుంది.