పర్మినెంట్ జడ్జి లేకుండానే సూపర్ హిట్ కామెడీ షో..!
తెలుగు బుల్లితెర మీద సూపర్ హిట్ కామెడీ షోగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది జబర్దస్త్. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో దాదాపు దశాబ్ధ కాలంగా ఈ షో కొనసాగుతుంది.;

తెలుగు బుల్లితెర మీద సూపర్ హిట్ కామెడీ షోగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది జబర్దస్త్. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో దాదాపు దశాబ్ధ కాలంగా ఈ షో కొనసాగుతుంది. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. గురు, శుక్రవారాల్లో నైట్ ప్రైం టైం లో ఈ కామెడీ షో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఐతే ఒకప్పుడు ఎక్కువ మంది టీం మెంబర్స్ తో కళకళలాడే ఈ షో ఇప్పుడు జనాలు తగ్గేసరికి ఆ జోష్ తగ్గింది. అయినా కూడా ఉన్న కమెడియన్స్ తమ శక్తివంచన లేకుండా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని చూస్తున్నారు.
ఐతే కమెడియన్స్ మాత్రమే కాదు జబర్దస్త్ షోకి ఈమధ్య పర్మినెంట్ జడ్జులు కూడా లేకుండా అయ్యిందని తెలుస్తుంది. జబర్దస్త్ జడ్జ్ లుగా ఒక మేల్ మరొకరు ఫిమేల్ ని కొనసాగిస్తూ వచ్చారు. నాగబాబు, రోజా ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ జడ్జిలుగా కొనసాగారు. ఐతే ఎప్పుడైతే వాళ్లు తప్పుకున్నారో వారిలా పర్మినెంట్ జడ్జిలు మాత్రం కుదరట్లేదు. జబర్దస్త్ జడ్జిలుగా కృష్ణ భగవాన్, మనో చేశారు.
ఈమధ్య కొత్తగా శివాజి జబర్దస్త్ జడ్జిగా కనిపిస్తున్నాడు. కొత్త జడ్జిగా ఆయనకు గ్రాండ్ వెల్కం చెప్పారు. ఐతే మేల్ జడ్జిగా శివాజి ఓకే కానీ ఫిమేల్ జడ్జి మాత్రం రెండు ఎపిసోడ్స్ కి ఒకరు మారుతూనే ఉన్నారు. మొన్నటిదాకా జబర్దస్త్ జడ్జిగా ఇంద్రజ కొన్నాళ్లు అలరించారు. ఆమెను శ్రీదేవి డ్రామా కంపెనీకి షిఫ్ట్ చేసి ఆమె ప్లేస్ లో ఖుష్బూని తీసుకున్నారు. ఖుష్బూ జబర్దస్త్ జడ్జిగా చేస్తున్నా అప్పుడప్పుడు ఆమె మిస్ అవుతున్నారు.
రీసెంట్ గా ఒక నాలుగైదు ఎపిసోడ్స్ ఒకప్పటి హీరోయిన్ లయ జబర్దస్త్ జడ్జిగా శివాజి పక్కన కనిపించారు. ఐతే ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో మాత్రం మళ్లీ ఖుష్బూనే జడ్జిగా వచ్చారు. మరి దశాబ్ద కాలం నుంచి సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న జబర్దస్త్ షోకి పర్మినెంట్ జడ్జి లేకపోవడం మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. జబర్దస్త్ టీం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి. అంతేకాదు జబర్దస్త్ షో నిడివి కూడా తగ్గించారు. ఇదివరకు 1 అవర్ పాటు వచ్చే ఈ షోని ఇప్పుడు అరగంటకి కుదించారు. ఉన్న టీమ్స్ తోనే షోని నడిపిస్తున్నారు. షో భవితవ్యం ఏంటన్నది అర్ధం కాక ఉన్నారు ఆ కామెడీ షో ఫ్యాన్స్.