'రామాయణం పార్ట్-1': యష్తో హాలీవుడ్ స్టంట్ మాస్టర్!
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘రామాయణం పార్ట్-1’ సినిమా టాలీవుడ్, బాలీవుడ్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.;
రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘రామాయణం పార్ట్-1’ సినిమా టాలీవుడ్, బాలీవుడ్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. నితీష్ తివారి డైరెక్షన్లో, నమిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం దీపావళి 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ ఇప్పటికే గాసిప్స్ తో అభిమానులను ఆకర్షించింది, ఇప్పుడు కొత్త అప్డేట్తో మరింత హైప్ సృష్టిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, ‘రామాయణం పార్ట్-1’లో యాక్షన్ సీక్వెన్స్ల కోసం యష్తో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ గై నారిస్ చేతులు కలిపాడు. ‘మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘మాడర్టల్ కోంబాట్’ లాంటి హాలీవుడ్ హిట్స్లో స్టంట్స్ డిజైన్ చేసిన గై నారిస్, ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను మరింత థ్రిల్లింగ్గా తీర్చిదిద్దనున్నాడు.
“మిత్ మీట్స్ మ్యాడ్నెస్” అనే ట్యాగ్లైన్తో ఈ కాంబినేషన్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్లు రావణుడి పాత్రకు కొత్త డైమెన్షన్ను తీసుకొస్తాయని టీమ్ భావిస్తోంది. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్ర కోసం ఇప్పటికే ఇంటెన్స్ ట్రైనింగ్లో ఉన్నాడు. ‘KGF’ సిరీస్తో పాన్-ఇండియా స్టార్గా ఎదిగిన యష్, ఈ సినిమాలో రావణుడి ఇంటెన్సిటీ, ఎమోషనల్ డెప్త్ను అద్భుతంగా చూపించనున్నాడని అంటున్నారు.
గై నారిస్ డిజైన్ చేసే యాక్షన్ సీక్వెన్స్లు రామ-రావణ యుద్ధ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయి. ఈ సన్నివేశాలను ముంబైలోని ఓ భారీ సెట్లో చిత్రీకరించనున్నారు, ఇందుకోసం టీమ్ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది. సినిమాలో సాయి పల్లవి, రణబీర్ కపూర్లతో పాటు సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవి దుబే కుంభకర్ణుడిగా నటిస్తున్నారు.
ఏఆర్ రహమాన్ సంగీతం, శివ శక్తి దత్తా లిరిక్స్తో సినిమా ఆడియో ఆల్బమ్పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ టీమ్తో కలిసి పనిచేస్తున్నారు, దీనివల్ల ‘రామాయణం పార్ట్-1’ ఒక విజువల్ స్పెక్టాకిల్గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమా రామాయణాన్ని ఒక కొత్త కోణంలో చూపించనుందని టీమ్ చెబుతోంది. మొత్తంగా, ‘రామాయణం పార్ట్-1’ దీపావళి 2026లో ఐదు భాషల్లో విడుదలై, బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. ఇక యష్-గై నారిస్ కాంబో యాక్షన్ సీక్వెన్స్లు, రణబీర్-సాయి పల్లవి ఎమోషనల్ పెర్ఫామెన్స్లతో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.