మహర్షి ఎక్కడిదాకా వచ్చాడు

Update: 2018-12-08 09:47 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబో లో రూపొందుతున్న మహర్షి షూటింగ్ నిరాటంకంగా జరుగుతోంది.అమెరికా లో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్ లో  గత ఇరవై రోజులుగా ఏకధాటిగా షూట్ చేస్తున్న వంశీ మరో రెండు వారాల పాటు ఇక్కడే కంటిన్యూ చేయబోతున్నట్టు తెలిసింది. సెకండ్ హాఫ్ దాదాపు ఈ గ్రామీణ నేపథ్యంలోనే వస్తుందని టాక్. వచ్చాడయ్యో సామీ తరహా లో దాని మించే రేంజ్ లో మహేష్ మీద ఓ గ్రూప్ సాంగ్ ఉంటుందని దాని చిత్రీకరణ కూడా ఈ రెండు వారాల షెడ్యూల్ లోనే పూర్తవుతుందని సమాచారం.

పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో అల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ గా కీలకమైన పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ లుక్ కాకూండా ఇంకెవరివి బయటికి రాకుండా జాగ్రత్త పడుతోంది టీమ్. మహేష్ అమెరికా నుంచి ఈ కుగ్రామానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే పాయింట్ మీదే మహర్షి కథ మొత్తం నడవనుంది. జగపతి బాబు- ప్రకాష్ రాజ్ -రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా వెన్నెల కిషోర్ కామెడీ పార్ట్ టేకప్ చేస్తున్నాడు.

మాస్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ అందరూ మెచ్చేలా అన్ని రకాల అంశాలు ఇందులో ఉంటాయని యూనిట్ నమ్మకంతో ఉంది. భరత్ అనే నేను దేవిశ్రీ ప్రసాద్ మహేష్ తో కంటిన్యూ అవుతున్నాడు. ఆల్రెడీ ఫిక్స్ అయిన ఏప్రిల్ 5 తేదీలో ఎలాంటి మార్పు ఉండబోవట్లేదని చెబుతున్నారు. సో వంద పైచిలుకు రోజులను కౌంట్ డౌన్ చేసుకుంటే మహర్షి వచ్చేస్తాడు.
    

Tags:    

Similar News