ఛార్మి బ్రేక్ కు కారణం ఏమై ఉంటుంది?

Update: 2021-08-04 15:30 GMT
టాలీవుడ్‌ లో హీరోయిన్ గా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ముద్దుగుమ్మ ఛార్మి ప్రస్తుతం కూడా నటిగా చేయాలనుకుంటే ఆఫర్లు క్యూ కడుతాయి. ఐటెం సాంగ్స్‌ ను ఆమెను వెతుక్కుంటూ వస్తాయి. కాని ఆమెకు ఫిల్మ్‌ మేకింగ్‌ పై ఇంట్రెస్ట్‌. అందుకే ఆమె పూరి జగన్నాద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలకు ప్రొడక్షన్ వర్క్‌ చూసుకుంటున్నారు. పూరి సొంత నిర్మాణ సంస్థ వ్యవహారాలను ఆమె చూసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో పూరి తెరకెక్కిస్తున్న లైగర్‌ సినిమా కు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలను కూడా ఆమెనే చూసుకుంటుంది అనే విషయం తెల్సిందే.

షూటింగ్‌ ల్లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా సోషల్‌ మీడియాలో అప్‌ డేట్‌ ఇస్తూనే ఉండే ఛార్మి తాజాగా షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా ఫొటోలు మరియు వీడియోలను షేర్‌ చేసే ఛార్మి ఈమద్య కాలంలో కాస్త సైలెంట్‌ అయ్యింది. ఛార్మికి ఏమైంది అనుకుంటూ ఉండగా ఆమె నుండి ఒక పోస్ట్‌ వచ్చింది. కొన్నాళ్ల పాటు నేను సోషల్‌ మీడియాకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా పేర్కొంది. అయితే పూర్తిగా కాదని.. త్వరలోనే మళ్లీ కలుద్దామన్నట్లుగా ఆమె పేర్కొంది. ఉన్నట్లు ఉండి ఆమె సోషల్‌ మీడియాకు దూరం అవ్వడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అసలు ఛార్మి ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో బ్యాడ్‌ కామెంట్స్ ను ఏమీ పొందలేదు. ఆమెను ఫాలో అవుతున్న వారు లక్షల్లో ఉన్నారు. అలాంటిది ఆమె వారికి దూరం అవ్వడంకు ఎందుకు సిద్దం అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లైగర్‌ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కావాలంటే అంతా కూడా ఛార్మి వైపు చూస్తున్నారు. ఇప్పుడు లైగర్‌ సినిమా అప్ డేట్స్ ను ఎవరు ఇస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారను. ఛార్మి తీసుకున్న నిర్ణయంను వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నరను. చిన్న బ్రేక్ గానే ఛార్మి వెనక్కు వస్తుందా లేదా ఎక్కువ రోజులే ఆమె బ్రేక్ తీసుకుంటుందా అనేది చూడాలి.
Tags:    

Similar News