దేవరకొండ.. మళ్ళీ అదే దూకుడు

Update: 2023-06-03 07:00 GMT
ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ ఖుషి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన ఏ సినిమాలో నటిస్తాడు అనే విషయం మీద అనేక అనుమానాలు ఉండగా ఇప్పటికి ఆయన పలు ప్రాజెక్టులు కూడా ఒప్పుకున్నాడు.

అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఏ సినిమా ప్రారంభం అవుతుందనే విషయం ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ తాజాగా ఈ విషయం మీద క్లారిటీ వచ్చేసింది. ఖుషి సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే విజయ్ దేవరకొండ ముందుగా గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతాడు.

ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైన వెంటనే దిల్ రాజు నిర్మాణంలో చివరిగా సర్కారు వారి పాట సినిమా చేసిన గీత గోవిందం దర్శకుడు పరశురాం దర్శకత్వంలో చేయబోతున్న సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది.

అంటే ఒకపక్క గౌతమ్ తో మరోపక్క పరుశురాం సినిమాతో... రెండు సినిమాలలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఒకే సమయంలో ఈ రెండు సినిమాల్లో ఆయన నటిస్తాడని ఒక సినిమా షూటింగ్ యాప్ లో మరో సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నిజానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన లైగర్ సినిమాతోనే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా పరిచయం అయ్యాడు.

కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న ఖుషీ సినిమాని కూడా పాన్ ఇండియాలోనే రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లోనే జనగణమన అనే సబ్జెక్టు గ్రాండ్ గా ప్రారంభమైంది కానీ లైగర్ దెబ్బకు ఆ సినిమా పక్కన పెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే ఫ్యూచర్ లో ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.

Similar News