వైట్ల సినిమా సూపర్ అంటున్నాడు

Update: 2018-07-22 07:18 GMT
ఆగడు.. బ్రూస్ లీ.. మిస్టర్.. ఇందులో ఏది తక్కువ.. ఏది ఎక్కువ  అని ఎంచడం కష్టం. ఒకదాన్ని మించిన డిజాస్టర్ ఇంకోటి. ఈ మూడు సినిమాలతో శ్రీను వైట్ల ఏ స్థాయిలో పతనం అయిపోయాడో తెలిసిందే. ‘ఆగడు’ ముందు వరకు వైట్ల కోసం పెద్ద హీరోలు.. నిర్మాతలు క్యూలో ఉండేవాళ్లు. కానీ ఈ మూడు సినిమాల తర్వాత వైట్లతో సినిమా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఐతే ఈ హ్యాట్రిక్ డిజాస్టర్ల తర్వాత కూడా ఒక పేరున్న హీరోతో.. ఓ పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు శ్రీను వైట్ల. ‘రంగస్థలం’ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్‌’లో రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే సినిమాను వైట్ల రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం కొన్ని నెలల నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది.

మెజారిటీ షూటింగ్ అమెరికాలోనే చేస్తున్నారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తి కాగా.. రీ రికార్డింగ్ కోసం రషెస్ ఒకసారి చూశాడట సంగీత దర్శకుడు తమన్. అది చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి ట్విట్టర్లో మెసేజ్ పెట్టాడు. తాను చూసిన సన్నివేశాలు హిలేరియస్ గా ఉన్నాయని.. విజుల్స్ స్టన్నింగ్ అని.. శ్రీను వైట్ల రాక్డ్ అని అన్నాడు తమన్. అలాగే రవితేజ సూపర్ ఎనర్జీతో అదరగొట్టేశాడని కూడా చెప్పాడు. మరి తమన్ చెబుతున్నట్లు నిజంగా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అంత బాగా వస్తోందా.. లేక హైప్ పెంచడానికి వైట్ల అండ్ కో తమన్ తో అలా చెప్పించిందా అన్నది చూడాలి. ఏదేమైనా వైట్ల తన ఫార్ములా కథల్ని వదిలి బయటికి వచ్చి.. ఏదైనా కొత్తదనం చూపిస్తేనే ఈసారి వర్కవుటవుతుంది. ఈసారి తేడా వస్తే మాత్రం అంతే సంగతులు. రవితేజ లాంటి మిత్రులు కూడా అతడిని కాపాడలేరు. కెరీర్ క్లోజ్ అయిపోతుంది.
Tags:    

Similar News