స్టార్ కమెడియన్ విలన్ వేషాలు ప్రేక్షకులను మెప్పించేనా...?
టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లు తెలుగు ప్రేక్షకులను తమ కామెడీతో నవ్వించారు. అయితే కొంత మంది కమెడియన్లు మరో అడుగు ముందుకేసి హీరోగా కూడా తమ సత్తా చాటాలని ట్రై చేసారు. వాళ్లలో సక్సెస్ అయిన వారి కంటే ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ కేటగిరీలో సునీల్ ఒకరని చెప్పవచ్చు. సునీల్ తనదైన మార్క్ కామెడీతో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. ఒకానొక సమయంలో కమెడియన్ సునీల్ లేకుండా సినిమా లేదు అనే పరిస్థితి వచ్చింది. అయితే సునీల్ హ్యస్యనటుడిగా పీక్ స్టేజిలో ఉన్నప్పుడు 'అందాల రాముడు' సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాదరామన్న'తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ వెంటనే వరుసగా సినిమా ఛాన్సులు రావడంతో హీరోగా కంటిన్యూ అయ్యారు. అయితే తర్వాత రోజుల్లో సునీల్ హీరోగా నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫెయిల్యూర్స్ అయ్యాయి.
దీంతో మళ్లీ కామెడీగానే స్థిరపడాలని అనుకున్నారు. ఈ క్రమంలో 'అరవింద్ సమేత వీర రాఘవ' చిత్రంతో ముందుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య లాంటి కమెడియన్స్ హవా చూపిస్తున్నారు. దాంతో ఇప్పుడు విలన్ తరహా పాత్రలను చేయడానికి కూడా సునీల్ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటించిన 'డిస్కోరాజా' సినిమాలో సునీల్ విలన్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా పరాజయాన్ని చవిచూడటంతో, సునీల్ సాహసాన్ని జనాలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సునీల్ కెరీర్ కి ఇది కాస్త టర్నింగ్ పాయింట్ అనే చెప్పొవచ్చు. ఎందుకంటే సునీల్ హీరోగా చేస్తున్నప్పుడు వచ్చే రెమ్యూనరేషన్ ఇప్పుడు విలన్ వేస్తున్నప్పుడు కూడా వస్తున్నాయట. ప్రస్తుత సినిమాలకు సునీల్ విలనీ వేషాలు వేయాలంటే రెండు డిమాండ్స్ చేస్తున్నాడట. అవేంటంటే విలన్ గా చేయాలంటే సుమారు కోటి రూపాయలు ఇవ్వాలి లేదా రోజుకు 3 లక్షలు చొప్పున మినిమమ్ 30 రోజులు కాల్షీట్స్ ఆయినా తీసుకోవాలి.
ప్రస్తుతం సునీల్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్న అన్ని సినిమాలు ఇలాంటి డీల్ కుదర్చుకున్నవేనట. అయితే 'డిస్కోరాజా' ఫ్లాప్ అవ్వడంతో కాస్త రేట్ తగ్గించుకోమని అడుగుతున్నా సునీల్ మాత్రం తగ్గడం లేదట. ప్రస్తుతం సునీల్ 'కలర్ ఫోటో' సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. ఇటీవల కమెడియన్ గా పరిచయమైన సుహాస్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మరి ఈ కొత్త హీరోకి సీనియర్ నటుడు సునీల్ విలన్ గా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. విభిన్నమైన ఈ విలన్ రోల్ పై సునీల్ ఆశలు పెట్టుకున్నాడట. కాగా సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.
దీంతో మళ్లీ కామెడీగానే స్థిరపడాలని అనుకున్నారు. ఈ క్రమంలో 'అరవింద్ సమేత వీర రాఘవ' చిత్రంతో ముందుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు టాలీవుడ్ లో కమెడియన్ల తాకిడి ఎక్కువైంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సత్య లాంటి కమెడియన్స్ హవా చూపిస్తున్నారు. దాంతో ఇప్పుడు విలన్ తరహా పాత్రలను చేయడానికి కూడా సునీల్ ఉత్సాహాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో రవితేజ హీరోగా నటించిన 'డిస్కోరాజా' సినిమాలో సునీల్ విలన్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా పరాజయాన్ని చవిచూడటంతో, సునీల్ సాహసాన్ని జనాలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే సునీల్ కెరీర్ కి ఇది కాస్త టర్నింగ్ పాయింట్ అనే చెప్పొవచ్చు. ఎందుకంటే సునీల్ హీరోగా చేస్తున్నప్పుడు వచ్చే రెమ్యూనరేషన్ ఇప్పుడు విలన్ వేస్తున్నప్పుడు కూడా వస్తున్నాయట. ప్రస్తుత సినిమాలకు సునీల్ విలనీ వేషాలు వేయాలంటే రెండు డిమాండ్స్ చేస్తున్నాడట. అవేంటంటే విలన్ గా చేయాలంటే సుమారు కోటి రూపాయలు ఇవ్వాలి లేదా రోజుకు 3 లక్షలు చొప్పున మినిమమ్ 30 రోజులు కాల్షీట్స్ ఆయినా తీసుకోవాలి.
ప్రస్తుతం సునీల్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్న అన్ని సినిమాలు ఇలాంటి డీల్ కుదర్చుకున్నవేనట. అయితే 'డిస్కోరాజా' ఫ్లాప్ అవ్వడంతో కాస్త రేట్ తగ్గించుకోమని అడుగుతున్నా సునీల్ మాత్రం తగ్గడం లేదట. ప్రస్తుతం సునీల్ 'కలర్ ఫోటో' సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. ఇటీవల కమెడియన్ గా పరిచయమైన సుహాస్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. మరి ఈ కొత్త హీరోకి సీనియర్ నటుడు సునీల్ విలన్ గా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి. విభిన్నమైన ఈ విలన్ రోల్ పై సునీల్ ఆశలు పెట్టుకున్నాడట. కాగా సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.