ఇంద్రగంటి మల్టీస్టారర్.. హీరోలు వీరేనట.?

Update: 2018-07-15 08:10 GMT

యాక్షన్ థ్రిల్లర్ మూవీస్.. తెలుగులో వచ్చేవి తక్కువే.. ఈ కొత్త కాన్సెప్ట్ పై ఇప్పుడు  టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్  దిల్ రాజు బోలెడు ఆశలు పెంచుకున్నారు. ఇందుకోసం ఇద్దరు హీరోలను కూడా ఒప్పించాడని ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యాడని అంటున్నారు.

 సమ్మోహనం మూవీతో హిట్ కొట్టిన మోహన్ కృష్ణ ఇంద్రగంటి వద్ద యాక్షన్ థ్రిల్లర్ కథ ఉండడం.. అది దిల్ రాజుకు నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్ సమాచారం. దిల్ రాజు వద్ద ప్రస్తుతం హీరోలు నాని - శర్వానంద్ ల కాల్షీట్లు ఉన్నాయట.. ఇప్పుడు ఈ ఇద్దరిని హీరోలుగా పెట్టి ఇంద్రగంటి దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీ తీయడానికి దిల్ రాజ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

ఈ సినిమాలో ఇద్దరు హీరోల క్యారెక్టర్లు చాలా బాగా డిజైన్ చేశాడట దర్శకుడు ఇంద్రగంటి.. సినిమా ఫస్టాఫ్ వరకూ అసలు ఎవరు హీరో.. ఎవరు విలనో ఎవ్వరికీ తెలియదట.. సెకాండఫ్ లోనే నాని - శర్వనాంద్ లలో ఎవరు విలన్ అనేది తెలుస్తుందట.. సూపర్ కథ - కథనం కావడంతో ఈ మల్టీస్టారర్ పై ఇండస్ట్రీలో బోలెడులో చర్చ నడుస్తోంది. రెగ్యులర్ ఇంద్రగంటి సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం.
Tags:    

Similar News