అందుకే 15 కోట్లు పెట్టి సినిమా చేశా!

సీనియర్ యాక్టర్ నరేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీ నటుడిగా కొనసాగుతున్నారు. స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని తండ్రి పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు. అతని నుంచి కావాల్సినంత ఫన్ జెనరేట్ కావడంతో ఎక్కువగా జోవియల్ ఫాదర్ రోల్స్ కి నరేష్ ని ఎంపిక చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఉంటే చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నరేష్ ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కృష్ణ ప్రొడక్షన్స్ పై ఈ సినిమాని కూడా నరేష్ నిర్మిస్తూ ఉండటం విశేషం. ఎంఎస్ రాజు దర్శకత్వంలో మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. నరేష్ కి జోడీగా మళ్ళీ పెళ్లి మూవీలో పవిత్రా లోకేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక వీరిద్దరి వ్యవహారం గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. లివింగ్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరిపై నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి విమర్శలు చేయడం, అలాగే మైసూర్ లో హోటల్ లో ఉంటే వెళ్లి హడావిడి చేయడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో కూడా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం సెన్సేషన్ గా మారింది.
తన చుట్టూ జరిగిన సంఘటనలని ఇతివృత్తంగా తీసుకొని నరేష్ మళ్ళీ పెళ్లి సినిమా చేశారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మళ్ళీ పెళ్లి అనేది నా జీవితానికి మాత్రమే సంబందించినది కాదని చెప్పారు. సొసైటీలో చాలా మంది జీవితాలకి దగ్గరగా ఉంటుందని అన్నారు. వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉన్న, సరైన జీవిత భాగస్వామిలు లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ చిత్రంలో చూపించడం జరిగిందని అన్నారు.
ఎవరి మీదనో రివేజ్ కోసం 15 కోట్లు పెట్టి రెండు భాషలలో సినిమా చేసే అవసరం నాకు లేదు. వాటికోసం యుట్యూబ్ లు, సోషల్ మీడియా ఉంది. అయితే ఒక వ్యక్తి ప్రమేయం వలన ఇవన్నీ వచ్చాయి. పరిస్థితుల ప్రభావంతో విడాకులకి అప్లై చేశాను. తరువాత వారు మా బంధాన్ని బ్రేక్ చేయాలని చాశారు. ఆ సమయంలో కూడా నన్ను నమ్మి పవిత్ర నా వెంట నిలబడింది. అలాంటి పవిత్రకి ప్రాణం ఉన్నంత వరకు తోడుగా ఉంటాను.
మాకు తెలిసి మా పెళ్లి మనసులు ముడిపడి ఇప్పటికే అయిపొయింది. సమయం బట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటాం అని నరేష్ చెప్పుకొచ్చారు. ఇక పవిత్ర లోకేష్ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య ఉన్న పాజిటివిటీ ఒకరిని ఒకరికి దగ్గర చేసింది. ఎవరో మీదనో రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచన మాకు లేదు. ట్రోలింగ్, విమర్శలు వచ్చినపుడు నరేష్ నాకు అండగా నిలబడ్డారు. ఆయనతోనే నా బంధం ముడిపడి ఉంది అని పేర్కొన్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే ఉంటే చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నరేష్ ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ కృష్ణ ప్రొడక్షన్స్ పై ఈ సినిమాని కూడా నరేష్ నిర్మిస్తూ ఉండటం విశేషం. ఎంఎస్ రాజు దర్శకత్వంలో మళ్ళీ పెళ్లి టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. నరేష్ కి జోడీగా మళ్ళీ పెళ్లి మూవీలో పవిత్రా లోకేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక వీరిద్దరి వ్యవహారం గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. లివింగ్ రిలేషన్ లో ఉన్న వీరిద్దరిపై నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి విమర్శలు చేయడం, అలాగే మైసూర్ లో హోటల్ లో ఉంటే వెళ్లి హడావిడి చేయడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో కూడా నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారం సెన్సేషన్ గా మారింది.
తన చుట్టూ జరిగిన సంఘటనలని ఇతివృత్తంగా తీసుకొని నరేష్ మళ్ళీ పెళ్లి సినిమా చేశారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మళ్ళీ పెళ్లి అనేది నా జీవితానికి మాత్రమే సంబందించినది కాదని చెప్పారు. సొసైటీలో చాలా మంది జీవితాలకి దగ్గరగా ఉంటుందని అన్నారు. వివాహ వ్యవస్థ మీద గౌరవం ఉన్న, సరైన జీవిత భాగస్వామిలు లేకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ఈ చిత్రంలో చూపించడం జరిగిందని అన్నారు.
ఎవరి మీదనో రివేజ్ కోసం 15 కోట్లు పెట్టి రెండు భాషలలో సినిమా చేసే అవసరం నాకు లేదు. వాటికోసం యుట్యూబ్ లు, సోషల్ మీడియా ఉంది. అయితే ఒక వ్యక్తి ప్రమేయం వలన ఇవన్నీ వచ్చాయి. పరిస్థితుల ప్రభావంతో విడాకులకి అప్లై చేశాను. తరువాత వారు మా బంధాన్ని బ్రేక్ చేయాలని చాశారు. ఆ సమయంలో కూడా నన్ను నమ్మి పవిత్ర నా వెంట నిలబడింది. అలాంటి పవిత్రకి ప్రాణం ఉన్నంత వరకు తోడుగా ఉంటాను.
మాకు తెలిసి మా పెళ్లి మనసులు ముడిపడి ఇప్పటికే అయిపొయింది. సమయం బట్టి శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకుంటాం అని నరేష్ చెప్పుకొచ్చారు. ఇక పవిత్ర లోకేష్ మాట్లాడుతూ మా ఇద్దరి మధ్య ఉన్న పాజిటివిటీ ఒకరిని ఒకరికి దగ్గర చేసింది. ఎవరో మీదనో రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచన మాకు లేదు. ట్రోలింగ్, విమర్శలు వచ్చినపుడు నరేష్ నాకు అండగా నిలబడ్డారు. ఆయనతోనే నా బంధం ముడిపడి ఉంది అని పేర్కొన్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.