టైటిల్ లోగో పోస్టర్: చిత్రలహరి

Update: 2019-01-15 16:28 GMT
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చితం 'చిత్రలహరి.  మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ సినిమా టైటిల్ లోగో పోస్టర్ ను విడుదల చేశారు.  ప్రేక్షకులకు ఈ పోస్టర్ ద్వారానే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.   
 
'చిత్రలహరి' టైటిల్ లోగో డిజైన్ ఆసక్తికరంగా ఉంది.  ఒక వృత్తానికి మధ్యలో చిత్రలహరి టైటిల్ వచ్చింది. అదే పోస్టర్లో ఈ సినిమాను ఏప్రిల్ 12 తారీఖున విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా నాగ చైతన్య 'మజిలీ'.. నాని 'జెర్సీ' సినిమాల విడుదల తేదీలను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలు ఏప్రిల్ 5 న రిలీజ్ అవుతున్నాయి.. ఈ సినిమాలు విడుదలయిన వారానికి 'చిత్రలహరి' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శన్.. నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సాయి ధరమ్ తేజ్ సినిమాలు వరసగా ఫ్లాపులు అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా విజయం తన కెరీర్ కు చాలా కీలకం కానుంది.   


Tags:    

Similar News