డెవిల్ మహేష్ కోసం అనుకున్న సబ్జెక్టేనా

Update: 2019-09-16 09:47 GMT
ఒక హీరో చేయాల్సిన కథను మరో హీరో చేయడం ఇండస్ట్రీలో చాలా సహజంగా జరిగేదే.  ఇందుకు చాలానే కారణాలు ఉంటాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కొత్త సినిమా విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోందని టాక్ వినిపిస్తోంది.  'అర్జున్ రెడ్డి'.. 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ తన మూడవ సినిమాను రణబీర్ కపూర్ తో చేస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇది నిజానికి మహేష్ బాబు కోసం అనుకున్న కథ అనే టాక్ వినిపిస్తోంది.

కొంత కాలం క్రితం సందీప్ తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ మహేష్ బాబుకు ఒక కథ చెప్పానని..  స్టొరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని చెప్పాడు. తొలిదశ చర్చలు కాబట్టి క్లారిటీ వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అనుకున్నారు.  అయితే ఇప్పుడు సందీప్ తన కొత్త సినిమాను రణబీర్ కపూర్ తో చేస్తున్నాడని.. 'డెవిల్' అనే టైటిల్ అనుకుంటున్నాడని వార్తలు రావడంతో ఆ కథ మహేష్ కు చెప్పినదే అయి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.  ఎందుకంటే మహేష్ బాబుకు వినిపించిన కథ కూడా ఇంటెన్స్ క్రైమ్ డ్రామా అని అంటున్నారు.  ఇప్పుడు రణబీర్ తో చేయనున్న సినిమా కూడా క్రైమ్ డ్రామా కావడంతో అదీ ఇదీ ఒకటేననే వాదన వినిపిస్తోంది.

తన నెక్స్ట్ సినిమా 'కబీర్ సింగ్' కంటే బోల్డ్ గా ఉంటుందని సందీప్ గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'కబీర్ సింగ్' సినిమానే జనాలను షేక్ చేసిందంటే ఇక ఈ 'డెవిల్' ను 'అంతకు మించి' అంటున్నాడు.. ఎలా ప్లాన్ చేస్తాడో వేచి చూడాలి. పైగా రణబీర్ ఇంటెన్స్ యాక్టర్.. పవర్ ఫుల్ రోల్ అయితే రెచ్చిపోయి నటిస్తాడు. ఈలెక్కన సందీప్ మరోసారి సంచలనం సృష్టించడం మాత్రం ఖాయమైనట్టే!
Tags:    

Similar News