బాలయ్యతో పూరీ జన గణ మన?

Update: 2016-10-27 04:20 GMT
దర్శకుడు పూరీ జగన్నాధ్ రీసెంట్ మూవీ ఇజం. కళ్యాణ్ రామ్ తో తీసిన ఈ చిత్రం రిజల్ట్ పై ఇప్పుడు ఓ అంచనాకు వచ్చేయచ్చు. దాదాపు 20 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ ఇవ్వడం.. ఐదు రోజుల్లో 8 కోట్లే రావడంతో.. బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు. అయితే.. వీకెండ్స్ వరకూ ఈ సినిమా సాధించిన వసూళ్లు పూరీ క్రేజ్ ని చాటి చెబుతున్నాయి. ఈ దర్శకుడు ఇప్పటికే ఎన్టీఆర్ తో పాటు.. మహేష్ బాబుకు జన గణ మన స్టోరీ చెప్పిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు బాలకృష్ణతో పూరీ ఓ సినిమా తీస్తున్నాడని.. అది దేశభక్తి కాన్సెప్ట్ తో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా అమితాబ్ ను కలిసేందుకు సర్కార్ సెట్స్ కు వెళ్లిన బాలయ్య.. రామ్ గోపాల్ వర్మను కూడా కలిశారు. ఆ సమయంలోనే తన శిష్యుడు పూరీకి ఆయనతో సినిమా చేయాలనే గురించి బయటపెట్టాడట వర్మ. ఈ ప్రపోజల్ కు సానుకూలంగా స్పందించిన బాలకృష్ణ.. తప్పనిసరిగా కలుస్తానని చెప్పి.. కబురు పంపారట కూడా.

ఇప్పుడు బాలయ్యకు వినిపించేందుకు దేశభక్తి చిత్రాన్ని రెడీ చేస్తున్నాడని తెలియడంతో.. మహేష్ కు వినిపించిన జన గణ మన స్టోరీనే.. బాలయ్యకు వీలుగా మార్చేసి పూరీ తీస్తాడనే టాక్ బయల్దేరింది. తను రాసిన ఓ స్టోరీని ఓ హీరో చేయకపోతే.. ఇంకో హీరోతో మొదలుపెట్టేయడం పూరీకి కొత్తేం కాదు. అప్పట్లో ఈడియట్ కథ పవన్ కే మొదట వినిపించానని.. పవర్ స్టార్ చేయనంటే రవితేజతో చేశానని ఓపెన్ గానే చెప్పిన సంగతి తెలుసుకదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News