పవన్ కళ్యాణ్ ఒక బందిపోటు..!

Update: 2020-03-13 13:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా షూటింగ్ లో బిజీ ఉండగానే తన తదుపరి చిత్రం పనులను శరవేగంగా మొదలుపెట్టాడు డైరెక్టర్ క్రిష్. పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ హిందీ నుండి రీమేక్ చేస్తుండగా ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజకీయాల తర్వాత పవర్ స్టార్ రీఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయి లో ఉంటాయి.

అలాంటిది తదుపరి చిత్రం గురించి చిన్న వార్త తెలిసినా అభిమానులకు పండగే. పవర్ స్టార్ నటించనున్న 27వ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను ఏ.యం. రత్నం నిర్మిస్తుండగా.. ఈ సినిమా మొఘలుల సామ్రాజ్యంలోని ఒక బందిపోటు కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. చారిత్రాత్మక చిత్రం కావడంతో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్ర వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలుస్తుందని, పవన్ కళ్యాణ్ నటించనున్న తొలి చారిత్రాత్మక చిత్రం కనుక చరిత్ర లో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. మరి డైరెక్టర్ క్రిష్ చాలా కాలం గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాపై పనిచేస్తున్నారు. రాజమౌళిలా సంవత్సరాల పాటు కాకుండా కొన్ని నెలలోనే షూటింగ్ పూర్తీ చేస్తాడని టాలీవుడ్ లో మంచి టాక్. చూడాలి మరి ఈ పవర్ స్టార్ పీరియాడిక్ బందిపోటు ఫిల్మ్ తెరమీదకి ఎప్పుడు రానుందో..
Tags:    

Similar News