మాయాబజార్ ని ఫాలో అవుతోన్న మహానటి

Update: 2017-10-21 07:35 GMT
టాలీవుడ్ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన మూవీ మాయా బజార్. 1957 లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికి మంచి ఆదరణను దక్కించుకుంటోంది. టాలీవుడ్ బడా దర్శకులు కూడా ఈ సినిమాను ఎంతో ఇష్టపడతారు. దర్శకదీరుడు రాజమౌళిని నిద్రలో లేపి అడిగినా తనకు ఇష్టమైన సినిమా మాయాబజార్ అని తరచూ చెబుతుంటారు.

గ్రాఫిక్స్ లేని కాలంలో కెమెరా యాంగిల్స్ తో మ్యాజిక్ చేసి ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని ఇచ్చారు మాయా బజార్ చిత్ర యూనిట్. ఆ సినిమాలో ముఖ్యంగా వివాహ భోజనంబు అనే సాంగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందులో ఎస్వీ. రంగారావు గారి హావభావాలను  చూస్తే ఎవ్వరైనా  ఫిదా అవాల్సిందే. అయితే ప్రస్తుతం సావిత్రి బాయోపిక్ లో ఆ సాంగ్ కి సంబదించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు గారు నటించనున్నారు. ఇక మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ గా హైదరాబాద్ లో వేసిన ఒక సెట్ లో మహానటి చిత్రీకరణ జరిగింది. అయితే ఆ సెట్ లో ఈ పాటకు సంబందించిన షూటింగ్ అద్భుతంగా జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే సగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ వారానికి ఒక సెట్ వేస్తోందట. ఎవడే సుబ్రహ్మణ్యం దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా వైజయంతి మూవీస్ వారు సినిమాను నిర్మిస్తున్నారు.



Tags:    

Similar News