టాలీవుడ్ మూవీలో పిల్ల కరీనా

Update: 2017-05-27 06:07 GMT
బాలీవుడ్ లో 2001 బ్లాక్ బస్టర్ మూవీ కభీ ఖుషీ కభీ ఘమ్ లోని ఏ ఒక్క ఫ్రేమ్ ని అయినా మర్చిపోవడం చాలా కష్టం. ఆ మూవీలో పూ అంటూ పూజా పాత్రలో ఆకట్టుకుంటుంది కరీనా కపూర్. బెబో పోషించిన పూజ చిన్నప్పటి పాత్రలో నటించిన అమ్మాయి పేరు మాళవికా రాజ్. ఆ అమ్మాయే ఇప్పుడు హీరోయిన్ అయిపోతోంది.

మంత్రి శ్రీనివాసరావు కుమారుడు రవి హీరోగా.. దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఓ చిత్రం రూపొందిస్తున్నాడు. జయదేవ్ అని ఈ చిత్రానికి టైటిల్ నిర్ణయించి.. నాలుగో సింహం అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టాడు. ఈ జయదేవ్ మూవీ ద్వారానే హీరోయిన్ గా పరిచయం అవుతోంది మాళవికా రాజ్. నిజానికి జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ఈ అమ్మాయి గతంలో కన్నడలో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ అవకాశం మిస్ అవడం.. మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమా కోసం దర్శకుడు అడగడం.. మాళవిక ఒప్పుకోవడం.. సినిమా చేసేయడం అన్నీ వరుసగా జరిగిపోయాయి.

చైల్డ్ యాక్ట్రెస్ గా సూపర్ పాపులర్ అయిన మాళవిక.. 2010లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచే వచ్చిన ఈ ముంబై భామ.. టాలీవుడ్ అరంగేట్రంపై మహా ఉత్సాహంగా ఉంది. జయదేవ్ చిత్రాన్ని జూన్ 9న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News