మహేష్ - థమన్ లొల్లి.. కారణమేంటి?

Update: 2023-05-29 10:14 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఈ మూవీ టైటిల్ ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ ప్రాజెక్ట్ కి పవర్ ఫుల్ మాస్ టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తమన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలు మ్యూజికల్ హిట్స్ కూడా అయ్యాయి. ఈ రెండు చిత్రాల సక్సెస్ లలో సాంగ్స్ కూడా ఒక కారణం అని చెప్పాలి. అందుకే మతాల మాంత్రికుడు మళ్ళీ తమన్ ని సూపర్ స్టార్ మూవీకి రిపీట్ చేశారు.

ఇక మహేష్ బాబు కూడా తమన్ తో చివరిగా సర్కారువారిపాట మూవీ చేశారు. ఈ మూవీలో కళావతి లాంటి హిట్ సాంగ్ ని ఇచ్చారు. ఈ సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ కి చాలా కమర్షియల్ హిట్స్ ని తమన్ అందించారు. అయినా కూడా ఎందుకనో సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంతకాలంగా తమన్ పై అసంతృప్తితో ఉన్నారంట.

ఎస్ఎస్ఎంబి 28 సినిమాకి అస్సలు తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవద్దని మహేష్ బాబు సూచించారంటా. అయిన కూడా త్రివిక్రమ్ పట్టుపట్టి తమన్ ని ఖరారు చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. సూపర్ స్టార్ తమన్ పై ఇంత అసంతృప్తితో ఉండటానికి కారణం అతని పిచ్చి అని టాక్. మ్యూజిక్ వర్క్ పెండింగ్ లో పెట్టి మరీ తమన్ క్రికెట్ పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు.

ఐపీఎల్ మ్యాచ్ లు మిస్ కాకుండా చూస్తాడు. ఇక  సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తమన్ క్రికెట్ టాలెంట్ ని అందరూ చూసే ఉంటారు. అందుకే ఈ సినిమా నుంచి తమన్ ని తప్పించే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నారంటూ టాక్.

అయితే మూవీ టైటిల్ పోస్టర్, మాస్ స్ట్రైక్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తమన్ ను ఈ మూవీ నుంచి తప్పించారనే టాక్ తెరపైకి రావడం విశేషం. ఇందులో వాస్తవమెంత తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Similar News