ఆమెకు కూడా వరకట్న వేధింపులట

Update: 2016-02-27 13:30 GMT
సెక్షన్ 498ఏ.. ఈ కేసు ఏంటో.. దీని ప్రభావం ఏంటో ఇండియాలో చాలామంది మగవాళ్లకు తెలుసు. వరకట్న వేధింపుల నుంచి మహిళలను కాపాడేందుకు రూపొందించిన ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని.. భర్తను, వారి తరఫు కుటుంబాన్ని వేధించేందుకు ఉపయోగపడే చట్టంగా మారిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కూడా తన భర్తపై ఈ కేసు పెట్టడం ఆశ్చర్యకరమైన విషయంగానే చెప్పాలి.

కరిష్మా కపూర్ - ఆమె భర్త సంజయ్ కపూర్ లు కొంతకాలం క్రితమే విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల కేసు బాంద్రా ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా.. భర్త సంజయ్ - అతని కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు పెట్టింది కరిష్మా. భర్త, అతని తరఫు కుటుంబం తనని వేధింపులకు గురి చేస్తున్నారంటూ కరిష్మా ఫిర్యాదు చేయడంతో.. వారిపై సెక్షన్ 498ఏ, 34 కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆస్తి, అంతస్తు పరంగా ఉన్నత స్థానంలో వీరు ఇలా పోలీసు కేసుల వరకూ వెళ్లడం.. ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఇదిలా ఉంటే.. అసలు కరిష్మా కపూర్ కి కుటుంబం అంటే ఏంటో తెలీదని, కనీస బాధ్యతలు కూడా నిర్వహించడం లేదంటున్నాడు ఆమె భర్త సంజయ్ కపూర్. డబ్బు కోసమే తనని పెళ్లి చేసుకుందని ఆరోపిస్తున్నాడు. పిల్లలను అడ్డుపెట్టుకుని తనను డబ్బు డిమాండ్ చేస్తోందని చెప్పుకొచ్చాడీయన.
Tags:    

Similar News