సుశాంత్‌ ఆత్మహత్యతో కరణ్‌ జోహార్‌ సంచలన నిర్ణయం

Update: 2020-06-18 10:10 GMT
సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ప్రతిభ ఉన్న నటుడిగా గుర్తింపు దక్కించుకున్న సుశాంత్‌ కు ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ఆ కారణంగానే డిప్రెషన్‌ కు లోనై ఆత్మహత్యకు ప్రయత్నించి ఉంటాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు బాలీవుడ్‌ ప్రముఖులు బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడగు పెట్టిన వారిని తొక్కేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వారి వల్లే సుశాంత్‌ వంటి ప్రతిభావంతుడు చివరకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందన్నాడు.

కరణ్‌ జోహార్‌ పై ప్రస్తుతం విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. కేవలం సినీ ప్రముఖుల వారసులతో మాత్రమే ఆయన సినిమాలు తీస్తున్నాడు. వారసులను స్టార్స్‌ గా మార్చడం ఆయనకే సాధ్యం అంటూ ఇండస్ట్రీలో పేరు కూడా ఉంది. అందుకే తమ వారసులను కరణ్‌ బ్యానర్‌ ద్వారా పరిచయం చేయాలని ఎంతో మంది బాలీవుడ్‌ స్టార్స్‌ ఆశ పడుతూ ఉన్నారు. బాలీవుడ్‌ కు చెందిన ఎంతో మంది కూడా కరణ్‌ జోహార్‌ బ్యానర్‌ ద్వారా వచ్చిన వారే.

బ్యాక్‌ గ్రౌండ్‌ లేని వారు కరణ్‌ జోహార్‌ జోహార్‌ సినిమాలో కనిపించరు. ఆయనకు అసలు ఇతరులు కనిపించరు అనేది టాక్‌. కరణ్‌ జోహార్‌ చాలా కాలంగానే ఈ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. సుశాంత్‌ మరణం తర్వాత ఆ విమర్శలు ఎక్కువ అయ్యాయి. అందుకే కరణ్‌ జోహార్‌ కొన్నాళ్ల పాటు తన బ్యానర్‌ లో స్టార్‌ వారసుల సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు ప్లాన్‌ చేసినా కూడా వాటిని క్యాన్సిల్‌ చేసుకునే ఉద్దేశ్యంలో ఉన్నాడట. మొత్తానికి సుశాంత్‌ మరణంతో కరణ్‌ జోహార్‌ నిర్మించే సినిమాల్లో మార్పులు రాబోతున్నాయి.
Tags:    

Similar News