మళ్లీ రెచ్చి పోయిన ఫైర్‌ బ్రాండ్‌.. వాడే హంతకుడు

Update: 2021-03-05 05:31 GMT
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో రెచ్చి పోతూనే ఉంది. ఆమె కొందరిని టార్గెట్‌ చేసి షేర్‌ చేస్తున్న పోస్ట్ లు మరియు విషయాలు హాట్ టాపిక్‌ అవుతున్నాయి. ఆమద్య ట్విట్టర్ లో వివాదాస్పద విషయాలను షేర్‌ చేస్తున్న కారణంగా ఆమె ఖాతా పై ఆంక్షలు విధించారు. దాంతో ట్విట్టర్‌ సీఈఓ ను టార్గెట్‌ చేసి ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత దుమారంను రేపాయి. ఇక ఈమె ఇన్ స్టా గ్రామ్‌ లో ఎక్కువగా ఈమద్య పోస్ట్‌ లు పెడుతుంది. ఇలాంటి సమయంలో ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య భారీగా తగ్గడం జరిగింది. తన ఫాలోవర్స్ సంఖ్య తగ్గడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

నాకు ఒక పనికిమాలిన లవర్ ఉండేవాడు. వాడే ఇదంతా చేస్తున్నాడు. వాడు ఏ కంపెనీలతో చర్చలు జరుపుతున్నాడో తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని కాదు. నా టీమ్‌ వాడి మొత్తం వ్యవహారాలను త్వరలోనే బయటకు తీసుకు వస్తుందని హెచ్చరించింది. నా ఫాలోవర్స్‌ సంఖ్య తగ్గించడానికి వాడు ఎంత ఖర్చు చేశాడో కూడా నాకు తెలుసు అంటూ కంగనా ఆరోపించింది. వాడు ఒక్క అమ్మాయిని పెళ్లి చేసుకోడు. ఎందుకంటే వాడి అల్మరా నిండుగా అస్థి పంజరాలు ఉంటాయి. సుశాంత్‌ ను చంపిన హంతకుడు కూడా వాడే అంటూ తీవ్ర వ్యాఖ్యలను కంగనా చేసింది. ఇంతకు ఆ పనికిమాలిన లవర్ ఎవరు అంటూ నెటిజన్స్ ఆమెను ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News